Share News

ఉగాదికి కొత్త ఆర్‌వోఆర్‌ చట్టం...!

ABN , Publish Date - Mar 27 , 2025 | 11:19 PM

కొత్త ఆర్‌వోఆర్‌ చట్టం తేవడం ద్వారా అపరిష్కృతంగా ఉ న్న భూ సమస్యలు పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభు త్వం కసరత్తు చేస్తోంది. మూడేళ్లుగా పరిష్కారానికి నోచుకోని భూ సమస్యలకు కొత్త చట్టంతో పరిష్కా రం చూపేందుకు సన్నద్ధం అవుతోంది.

ఉగాదికి కొత్త ఆర్‌వోఆర్‌ చట్టం...!

-భూ రికార్డుల్లో తప్పుల సవరణలకు చట్టబద్ధత

-వేర్వేరు భూములకు ప్రత్యేక రికార్డులు

-మూడేళ్ల నుంచి అపరిష్కతంగా సమస్యలు

-వ్యవసాయేతర భూములకూ పాస్‌బుక్స్‌ జారీ

మంచిర్యాల, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): కొత్త ఆర్‌వోఆర్‌ చట్టం తేవడం ద్వారా అపరిష్కృతంగా ఉ న్న భూ సమస్యలు పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభు త్వం కసరత్తు చేస్తోంది. మూడేళ్లుగా పరిష్కారానికి నోచుకోని భూ సమస్యలకు కొత్త చట్టంతో పరిష్కా రం చూపేందుకు సన్నద్ధం అవుతోంది. ఈ విషయ మై ఇప్పటికే ప్రజాభిప్రాయ సేకరణ పూర్తికాగా ఉగా ది పర్వదినం సందర్భంగా నూతన చట్టాన్ని అమలు లోకి తెచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. బీ ఆర్‌ఎస్‌ సర్కారు తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌ కారణం గా రైతుల ప్రమేయం లేకుండానే రెవెన్యూ రికార్డు ల్లో తప్పులు దొర్లడంతో సమస్య తీవ్రరూపం దాల్చిం ది. రెవెన్యూ సిబ్బంది చేసిన తప్పులకు అనేక మంది రైతులు అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. పూర్వీకుల నాటి నుంచి పట్టాగా ఉన్న భూములను ప్రభుత్వానివంటూ ఎలాంటి నోటీసులు లేకుండానే నిషేధిత జాబితాలో పెట్టి అష్టకష్టాలు పెడుతున్నా రు. అధికారుల చుట్టూ తిరిగినా సమస్య పరిష్కా రానికి నోచుకోవడం లేదు. కొత్త చట్టం భూ భారతి అమల్లోకి వస్తే...ధరణి పోర్టల్‌ కారణంగా ఇబ్బందు లు పడ్డ ప్రజానీకానికి సాంత్వన కలిగే అవకాశాలు ఉన్నాయి.

కోర్టును ఆశ్రయించక తప్పని పరిస్థితి...

ధరణి పోర్టల్‌లో తప్పొప్పుల సవరణకు ఇంతకా లం చట్టబద్ధతే లేకుండాపోయింది. సంబంధిత అధి కారులకు అఽధికారాలను సైతం చట్టబద్దంగా కట్టబె ట్టకపోవడంతో సమస్యలు అపరిష్కృతంగా మిగిలి పోయాయి. పేరు తప్పుబడినా, సర్వే నంబర్‌ మిస్‌ అయినా.. సిబ్బంది తప్పులకు సైతం కోర్టుకు వెళ్లా ల్సిన పరిస్థితి కల్పించారు. కోర్టుకు వెళ్లి ఆర్డర్‌ కాఫీ తెచ్చుకోండని సమస్యలతో వచ్చే రైతులకు మొహం మీదనే చెప్పేవారు. ఽధరణి పోర్టల్‌, ఆర్వోఆర్‌ 2020 నిబంధనలు, చట్టం కొందరికి మాత్రమే చుట్టాలుగా మారాయి. సామాన్యులకు చుక్కలు చూపించాయి. ఇప్పుడా చట్టాన్ని మార్చి రైతాంగానికి చిక్కులు తొల గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఆర్వోఆర్‌ చట్టాన్ని తీసుకొస్తున్నది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో అ ప్పటి సీఎం కేసీఆర్‌, మాజీ సీఎస్‌ సోమేష్‌కుమా ర్‌...అన్నీ తామై రూపొందించిన ధరణి పోర్టల్‌, ఆర్వో ఆర్‌ చట్టంలోని లొసుగులను సవరించి రైతులకు మేలు చేసే విధంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

భూ రికార్డుల నిర్వహణ..

గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్‌ పేరు ను రేవంత్‌ సర్కారు భూ భారతిగా నామకరణం చేసిన సంగతి తెలిసిందే. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అమలు జరుగుతున్న భూ రికార్డుల నిర్వహణ పద్ధ తులను పరిశీలించిన అనంతరం వ్యవసాయ, వ్యవ సాయేతర భూములకు సంబంధించి వేర్వేరు రికా ర్డులు చేయాలనే నిశ్చయానికి ప్రభుత్వం వచ్చింది. భూ రికార్డుల నిర్వహణకు మెరుగ్గా ఉండే విధంగా ముసాయిదా.. బిల్లుపై రైతు సంఘాలు, మేధావులు, విద్యావేత్తలు, న్యాయవాదులు, ప్రజా ప్రతినిధులు, విశ్రాంత రెవెన్యూ ఉద్యోగుల సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకోవడం ద్వారా కార్యాచరణ చేప ట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. భూ సేకరణలు, వ్య వసాయ, వ్యవసాయేతర భూములను గుర్తించి మం డల, డివిజన్‌ స్థాయిలో పరిష్కరించేలా మార్పులు తేవడంతోపాటు పట్టాదారు మృతి చెందిన పక్షంలో వారసత్వ భూముల బదలాయింపు ప్రక్రియ వేగ వంతం చేయనున్నారు. గ్రామాల్లో ఆబాదీ భూముల రికార్డులను ఆధునీకరించడం, సాదా బైనామా, భూ ముల రిజిస్ట్రేషన్‌ రుసుం వసూలు చేయడం, ఈసీ లో అనుభవదారుడి పేరిట కాలమ్‌ ప్రవేశపెట్టడం లాంటి మార్పులు చట్టంలో చోటు చేసుకోనున్నాయి. అప్పీల్‌ అథారిటీ ఆర్డీఓలకు అప్పగించేలా చర్యలు తీసుకోనున్నారు. భూ సమస్యల పరిష్కారానికి జిల్లా స్థాయిలో అప్పిలేట్‌ అథారిటీ ఉండే విధంగా రూ పకల్పన చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనుల హ క్కులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చట్టాన్ని రూ పొందించినట్లు తెలుస్తోంది. నూతన ముసాయిదా చట్టం విధివిధానాలను ఇప్పటికే సీసీఎల్‌ఏ వెబ్‌సైట్‌ లో అందుబాటులో ఉంచగా, చట్టానికి తుది మెరు గులు దిద్ది అందుబాటులోకి తెచ్చేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది.

రెండు ఆర్వోఆర్‌లో తేడాలు...

అంశం 2020 2025

సవరణలు అవకాశం లేదు అవకాశం ఉంది

రిజిస్ట్రేషన్‌ తహసీల్దార్‌ తహసీల్దార్‌, డీటీ

మ్యూటేషన్‌ సెక్షన్‌ 5,6,7 సెక్షన్‌ 5,7,8 విచారణతో

సబ్‌డివిజన్‌ లేదు అవకాశం కల్పించారు

డాక్యుమెంట్‌ పాస్‌బుక్‌ పాస్‌బుక్‌

అప్పీల్‌ లేదు సెక్షన్‌ 14,15లతో ఏర్పాటు

Updated Date - Mar 27 , 2025 | 11:19 PM