ఆంధ్రజ్యోతి 22వ వార్షికోత్సవ లక్కీ డ్రా శ్రీకాకుళం విజేతలు వీరే
ABN, Publish Date - Mar 25 , 2025 | 05:42 PM
ఆంధ్రజ్యోతి 22వ వార్షికోత్సవం సందర్భంగా శ్రీకాకుళం కార్యాలయంలో కార్ అండ్ బైక్ రేస్ లక్కీ డ్రా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా శ్రీకాకుళం అడిషనల్ ఎస్పీ వెంకటరమణ, డీఎస్పీ వివేకానందా హాజరయ్యారు.
ఆంధ్రజ్యోతి 22వ వార్షికోత్సవం సందర్భంగా శ్రీకాకుళం కార్యాలయంలో మంగళవారం నాడు కార్ అండ్ బైక్ రేస్ లక్కీ డ్రా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా శ్రీకాకుళం అడిషనల్ ఎస్పీ వెంకటరమణ, డీఎస్పీ వివేకానంద హాజరయ్యారు. విజయనగరానికి చెందిన బళ్ల రామకృష్ణ, మొదటి బహుమతిగా బైక్ను గెలుచుకున్నారు.
బొబ్బిలికి చెందిన లంక కుమారి ద్వితీయ బహుమతిగా రిఫ్రిజిరేటర్ దక్కించుకున్నారు. ఆముదాల వలసకు చెందిన లలితా కుమారి మూడో బహుమతిగా కలర్ టీవీ లభించింది. మరో వందమంది పాఠకులకు కన్సోలేషన్ బహుమతులు అందించారు. విజేతలకు అతిథులు శుభాకాంక్షలు తెలిపారు. నిత్యం పాఠకుల ఆదరాభిమానాలను పొందుతున్న ఆంధ్రజ్యోతి యాజమాన్యాన్ని ఎస్పీతో పాటు ఉన్నతాధికారులు అభినందనలు తెలిపారు.
ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated at - Mar 25 , 2025 | 10:16 PM