వల్లభనేని వంశీ నొటోరియస్ క్రిమినల్
ABN, Publish Date - Feb 14 , 2025 | 09:07 AM
2023లో గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసును నీరు గార్చేందుకు మాజీ ఎమ్మెల్యే, వివాదాస్పద వైసీపీ నేత వల్లభనేని వంశీ పన్నిన పథకం తిరిగి ఆయన మెడకే చిక్కుకుంది. కిడ్నాప్, బెదిరింపులు, ఎస్సీ, ఎస్టీ కేసులో వంశీని గురువారం ఉదయం విజయవాడ పోలీసులు హైదరాబాద్లో అరెస్టు చేశారు.
అమరావతి: వల్లభనేని వంశీ రిమాండ్ రిపోర్టులో పోలీసులు చాలా అంశాలు ప్రస్తావించారు. వంశీకి చట్టం, న్యాయం అంటే లెక్కలేదని నొటోరియస్ క్రిమినల్ అని.. ఆయనపై 16 క్రిమినల్ కేసులు ఉన్నాయని పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనపై సత్యవర్ధన్ ఫిర్యాదు మేరకు వంశీ తదిరులపై కేసు నమోదైంది. ఫిర్యాదు వాపస్ తీసుకోవాల్సిందిగా అప్పటి నుంచే ఆయనపై ఒత్తిళ్లు వస్తున్నాయని సత్యవర్ధన్ సోదరుడు కిరణ్ స్పష్టం చేశారు. కేసు వాపసు తీసుకుంటే డబ్బులు ఇస్తామని... ఒప్పుకోకుంటే చంపేస్తామని బెదిరించారని తెలిపారు. ‘పెద్దవాళ్లతో ఎందుకు పెట్టుకుంటారు’ అని వజ్ర కుమార్ అనే వ్యక్తి చాలాసార్లు పరోక్షంగా హెచ్చరించారని... కొమ్మా కోటి, రామకృష్ణ, వీర్రాజు తదితరులు తన సోదరుడిని, తల్లిదండ్రులనూ బెదిరించారని కిరణ్ తెలిపారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
ఈ వార్త కూడా చదవండి..
బర్డ్ ఫ్లూ.. 5 వేల 500 కోళ్లు మృతి..
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీలో డైనమిక్ క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్
వంశీకి 14 రోజుల రిమాండ్.. జైలుకు తరలింపు..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Feb 14 , 2025 | 09:07 AM