Home » Chennai News
గత కొద్దిరోజులుగా ఎండవేడిమితో అల్లాడిపోయిన నగర ప్రజలకు అకాల వర్షం కొంత ఉపశమనాన్ని ఇచ్చింది. గురువారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం భారీగానే కురిసింది. అయితే.. ఈ వర్షం వేసవి తాపాన్ని కొంత తగ్గించిందని చెప్పవచ్చు.
మాకు అన్నామలై కావాలి.., అన్నాడీఎంకేతో కూటమి వద్దు.. అంటూ వెలిసిన పోస్టర్లు తమిళనాట కలకలం పుట్టిస్తున్నాయి.. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇలాంటి పోస్టర్లు వెలుగుచూడడంతో ఇప్పుడు పెద్దఎత్తున చర్చకు దారితీస్తోంది.
ఎన్కౌంటర్లో ఓ రౌడీ హతమయ్యాడు. పలు దోపిడీలు, అక్రమాలకు పాల్పడ్డ ఆ రౌడీ చివరకు పోలీస్ తూటాకు బలయ్యాడు. విజయ్ అనే రౌడీ మూడు జిల్లాల్లో పలువురిని బెదిరించి డబ్బులు వసూలు చేసేవాడు. అలాగే అతనిపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా ఉన్నాయి.
ఆన్లైన్ రమ్మీ.. మరోకరి ప్రాణాలు తీసింది. మొత్తం రూ. 10 లక్షల పోవడంతో ఓ బ్యాంక్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విద్యావంతుడు.. పైగా బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ స్థాయి ఉద్యోగే ఈ క్రీడకు బలైపోయాడు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఓ పక్క ప్రపంచం కంప్యూటర్ యుగంలో దూసుకెళ్తున్నా ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఈ కుల జాడ్యం పోవడం లేదు. కులాంతర వివాహానికి సిద్ధమైందని.. తన తోడబుట్టిన చెల్లిని అన్న చంపేసిన సంఘటన వెలుగుచూసింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
తమిళనాడు రాష్ట్రంలోని కన్నియాకుమారితోవాలైలో లభ్యమైయ్యే అరుదైన మణిపూసలతో తయారుచేసే మాల, తంజావూర్ జిల్లా కుంభకోణం ‘కొళుందు వెట్రిలై’గా పిలిచే తమలపాకుకు భౌగోళిక గుర్తింపు వచ్చింద
గత ఎన్నికల సమయంలో మేం ఇచ్చిన మాట ప్రకారం కావేరి-వైగై-గుండారు నదుల అనుసంధానం చేసి తీరుతామని మంత్రి దురైమురుగన్ ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ.. నదుల అనుసంధానం విషయంలో ఎవరికీ ఎటువంటి అనుమాలు అవసరం లేదన్నారు. ఎన్ని ఇబ్బందులొచ్చినా ఆ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని మంత్రి పేర్కొన్నారు.
మీరు ఊటీ, కొడైకెనాల్ వెళ్తున్నారు.. అయితే.. ఈ విషయం గురించి తెలుసుకోవాల్సిందే. ముఖ్యంగా వాహనాల్లో వెళ్లేవారైతే తప్పకుండా తెలుసుకోవాల్సాందే మరి. రాష్ట్ర ప్రభుత్వం ఈ-పాస్ విధానాన్ని ప్రారంభించింది. వాహనాల రద్దీ తగ్గించేందుకుగాను రూపొందించిన ఈ-పాస్ విధానం అక్కడ అమల్లోకి వచ్చింది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈనెల 6వ తేదీన రామేశ్వరంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పాంబన్ వంతెనను ఆయన ప్రారంభించనున్నారు. అలాగే పలు కార్యక్రమాల్లో కూడా ప్రధాని పాల్గొననున్నారు. ప్రధాని పర్యటనను విజయవంతం చేసేందుకు అటు అధికార యంత్రాంగం ఇటు బీజేపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశారు.
జూలో మగ సింహం మృతిచెందింది. ‘వీరా’ అనే మగ సింహం గత కొద్దిరోజులుగా తీవ్ర అనారోగ్యానికి గురైంది. అది నడుము వద్ద కండరాల లోపంతో బాధపడుతున్నట్లు గుర్తించారు. దానికి చికిత్స అందిస్తున్నటికీ శనివారం మృతిచెందింది.