Home » Chennai News
నీట్ పరీక్ష మరొకరిని బలిగొంది. నీట్ ఆత్మహత్యలు ఆగడం లేదు. పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేననే భయంతో దేవదర్శిని అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ పరీక్ష పుణ్యమాని చాలామంది విద్యార్థులు ఇప్పటికే తమ ప్రాణాలు తీసుకున్నారు.
అన్నాడీఎంకే నేతలపై రాష్ట్ర ఉమ ముఖ్యమంత్రి వ్యంగ్యాస్త్రాలు విసిరారు. కమలనాథుల దర్శనం కోసం కార్లు మార్చి మార్చి వెళ్ళారంటూ.. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చానీయాంశమైంది.
ప్రముఖ హీరో, టీవీకే పార్టీ అధినేత విజయ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మాకు ఎవరితోనూ పోటీ లేదని, అధికార డీఎంకే పార్టీతోనే తమకు పోటీ ఉంటుందని ఆయన పేర్కొనడం రాష్ర్ట వ్యాప్తంగా చర్చానీయాంశమైంది.
కాచిగూడ, చర్లపల్లి నుంచి ప్రత్యేక రైళ్ల సేవలు పొడిగించినట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుత వేసవి సీజన్ నేపధ్యంలో ఈ రైళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. కాగా... ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
హోంశాఖ మంత్రి అమిత్ షాను భారత ఉక్కు మనిషి సర్ధార్ వల్లభాయ్ పటేల్ ప్రతిరూపంగా చూస్తున్నామంటూ అన్నాడీఎంకే మాజీ మంత్రి, శాసనసభ ప్రతిపక్ష ఉప నేత ఆర్బీ ఉదయకుమార్ అభివర్ణించారు. అలాగే.. తమిళనాడు ఉక్కు మనిషి ఎడప్పాడి పళనిస్వామి కలుసుకున్న వ్యవహారంలో పలు వార్తలు వెలువడుతున్నాయనన్నారు.
చెన్నై సెంట్రల్-ముంబై(వయా కడప) ప్రత్యేక వారాంతపు రైళ్లు నడుపుతున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. ఈ వారాంతపు ప్రత్యేక రైళ్లు ఏప్రిల్ 9,16,23,30 తేదీల్లో నడుస్తాయని దక్షిణ రైల్వే తెలిపింది. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించింది.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన ప్రభుత్వ కార్యక్రమాలన్నీ రద్దయ్యాయి. గత కొద్దిరోజులుగా ఆయన ప్రభుత్వ కార్యక్రమాల్లో బీజీబీజీగా గడుపుతున్నారు. కాగా.. వైద్యుల సూచన మేరకు ఆయన ఇంటివద్దే విశ్రాంతి తీసుకుంటున్నట్టు ఆయన తండ్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు.
అన్ని రాజకీయపార్టీకు రాష్ట్ర హైకోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. 21వ తేదీలోగా పార్టీ జెండాలు తొలగించకపోతే కేసులు చేయాలని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. పార్టీ జెండాలు, దిమ్మెలు తప్పకుండా తొలగించాల్సిందేనని హెచ్చరించింది.
ఆ మాజీ ముఖ్యమంత్రిని తిరిగి పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదని అన్నాడీఎంకే ప్రధానకార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి స్పష్టం చేశారు. దీనిపై ఎవరికీ ఎటువంటి అనుమానాలు అవసరంలేదని ఆయన మరోమారు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు శుక్రవారం చెన్నై నగరంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అడయార్లోని ‘మద్రాస్ ఐఐటీ’లో ఉదయం 11 గంటలకు జరుగనున్న ‘ఆలిండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్-2025’లో పాల్గొని ప్రసంగించనున్నారు.