Home » Kakani Govardhan Reddy
Kakani Govardhan Reddy: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత జగన్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలపై ఫోకస్ పెట్టింది. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి భారీ దందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. కాకాణి అక్రమ భాగోతాలు బయటకు వస్తున్నాయి.
Somireddy: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. జగన్ హయాంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇళ్ల స్థలాల కోసం సేకరించిన భూముల్లో ఎంత దోపిడీ చేశావో అందరికీ తెలుసునని చెప్పారు. ఎన్నికల కోడ్కు ఒక్క రోజు ముందు కాకాణి గోవర్ధన్ రెడ్డి 57.5 ఎకరాలు కొట్టేశారని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు.
Kakani Govardhan Reddy land scam: మాజీ మంత్రి కాకణి గోవర్థన్ రెడ్డి భారీ స్థాయిలో భూ ఆక్రమణలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై కూటమి ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపించాలని బాధితులు కోరుతున్నారు.
నెల్లూరు: వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డిపై కేసు నమోదు అయ్యింది. కాకాణిపై నెల్లూరు జిల్లా కావలి వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల బోగోలు మండలం కోళ్లదిన్నెలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అయితే ఇరువర్గాల వారు తీవ్రంగా గాయపడడంతో వారిని కావలి ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చారు.
వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పోలీసులపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్సీపీ శ్రేణులపై టీడీపీ కార్యకర్తలు దాడులు చేస్తున్నారని, పోలీసులు టీడీపీ వారికి సహకరిస్తున్నారంటూ కాకాణి రివర్స్ ఎటాక్ చేశారు. మళ్లీ వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుందని.. పోలీసులు సప్తసముద్రాల అవతల ఉన్నా, లాక్కొచ్చి, ఒంటి మీద బట్టలు ఊడదీసి నిలబెడతామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Kakani Govardhan: పోలీసులపై, రెవెన్యూ సిబ్బందిపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు. సీఐ సుబ్బారావు, ఆర్ఐ రవిలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు.
‘వైసీపీ నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటశేషయ్యపై సీఐ సుబ్బారావు, ఆర్ఐ రవి తప్పుడు కేసు పెట్టారు.
కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తే తాము భయపడమని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఏపీ హైకోర్టు ఉత్తర్వుల మేరకు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని విడుదల చేశారని తెలిపారు.
గత వైసీపీ ప్రభుత్వంలో సర్వేపల్లి నియోజకవర్గం(Sarvepalli Constituency)లో ఇరిగేషన్ పనులకు సంబంధించి రూ.200కోట్ల అవినీతి జరిగినట్లు ఎమ్మెల్యే, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్(Kakani Govardhan Reddy) ప్రాతినిధ్యం వహించిన సర్వేపల్లిలో పెద్దఎత్తున కుంభకోణం జరిగిందని ఆయన అన్నారు.
నెల్లూరు జిల్లా ముత్తుకూరు సర్పంచ్ బూదూరు లక్ష్మి(Bhuduru Lakshmi) సంతకాన్ని ఫోర్జరీ చేసి పంచాయతీ నిధులు స్వాహా చేసిన ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) విచారణకు ఆదేశాలు జారీ చేశారు. మహిళా సర్పంచ్ను కులం పేరుతో దూషించి బెదిరింపులకు పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.