Home » Palla Srinivasa Rao
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఐదేళ్లుగా పడిన కష్టం, పార్టీ బలోపేతం కోసం చేసిన కృషిని గుర్తించి అతి పెద్ద బాధ్యత అప్పగించామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన పల్లా శ్రీనివాసరావు యాదవ్తో సీఎం చంద్రబాబు అన్నారు.
ప్రభుత్వానికి, పార్టీకి మధ్య వారధిగా పనిచేస్తానని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. గత ఐదేళ్లలో అనేక కష్టాలు పడి, అధికారపక్షం దాడులకు ఎదురొడ్డి నిలబడిన కార్యకర్తలకు అండగా నిలబడతామని కష్టపడిన ప్రతి కార్యకర్తకు సముచిత న్యాయం చేస్తామని చెప్పారు.
ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ యాదవ్కు ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కీలక సూచనలు చేశారు. ‘‘పార్టీకి ప్రభుత్వానికి మధ్య వారధి మీరే. మీ కష్టాన్ని చూసి రాష్ట్ర అధ్యక్షుడిగా కీలక బాధ్యతలిచ్చాం. సీనియర్ల సూచనలు, జూనియర్ల మద్దతుతో పార్టీలో యువరక్తాన్ని చేర్చండి’’ అని పల్లాకు సీఎం సూచించారు.
తెలుగుదేశం పార్టీ ప్రారంభం నుంచి బీసీలు ఆ పార్టీకి అండగా నిలుస్తూ వస్తున్నారు. దీంతో ఆ సామాజిక వర్గానికి టీడీపీ అత్యంత ప్రాధాన్యతను ఇస్తోంది. వాస్తవానికి ఏపీ జనాభాలో అత్యధికశాతం బీసీలే. గత వైసీపీ ప్రభుత్వం అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తామని గొప్పుల చెప్పుకుంది.
ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు యాదవ్ను (Palla Srinivasa Rao) నియమించారు. ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) ఈ రోజు (ఆదివారం) అధికారికంగా ప్రకటించారు.