ACB COURT: ఫైబర్ నెట్ కేసులో ఆస్తుల అటాచ్మెంట్పై సీఐడీ పిటిషన్.. విచారణ వాయిదా
ABN , First Publish Date - 2023-11-08T20:35:11+05:30 IST
ఫైబర్ నెట్ కేసులో ఆస్తుల అటాచ్మెంట్ కోసం సీఐడీ దాఖలు చేసిన పిటిషన్పై విచారణను ఏసీబీ కోర్టు ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది. టెరా సాఫ్ట్ కంపెనీ, వేమూరి హరిప్రసాద్కు చెందిన ఏడు ఆస్తుల అటాచ్ మెంట్ కి అనుమతి ఇవ్వాలని సీఐడీ ప్రతిపాదన చేసింది.

విజయవాడ: ఫైబర్ నెట్ కేసులో ఆస్తుల అటాచ్మెంట్ కోసం సీఐడీ దాఖలు చేసిన పిటిషన్పై విచారణను ఏసీబీ కోర్టు ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది. టెరా సాఫ్ట్ కంపెనీ, వేమూరి హరిప్రసాద్కు చెందిన ఏడు ఆస్తుల అటాచ్ మెంట్ కి అనుమతి ఇవ్వాలని సీఐడీ ప్రతిపాదన చేసింది. స్థిరాస్తుల అటాచ్ మెంట్ కు అనుమతి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో రెండు రోజుల క్రితం సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. సీఐడీ పిటిషన్పై ఈ నెల 10న విచారణ చేయనున్నట్లు ఏసీబీ కోర్టు పేర్కొంది.