Share News

Chandrababu news: ములాఖత్‌ల విషయంలో ఏసీబీ కోర్ట్ కీలక ఆదేశాలు

ABN , First Publish Date - 2023-10-20T18:11:41+05:30 IST

ములాఖత్‌ల సంఖ్యను కుదించడంపై చంద్రబాబు దాఖలు చేసుకున్న పిటిషన్‌పై విజయవాడ ఏసీబీ కోర్ట్ కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబుకు జైలులో 2 లీగల్ ములాఖత్‌లు ఇవ్వాలని ఏసీబీ కోర్టు ఆదేశాలిచ్చింది.

Chandrababu news: ములాఖత్‌ల విషయంలో ఏసీబీ కోర్ట్ కీలక ఆదేశాలు

విజయవాడ: ములాఖత్‌ల సంఖ్యను కుదించడంపై చంద్రబాబు దాఖలు చేసుకున్న పిటిషన్‌పై విజయవాడ ఏసీబీ కోర్ట్ కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబుకు జైలులో 2 లీగల్ ములాఖత్‌లు ఇవ్వాలని ఏసీబీ కోర్టు ఆదేశాలిచ్చింది. కాగా అంతకుముందు చంద్రబాబు ములాఖత్‌ల సంఖ్యను జైలు అధికారులు 2 నుంచి ఒకటికి కుదిరించారు. దీంతో అధికారుల నిర్ణయాన్ని చంద్రబాబు తరపు న్యాయవాదులు ఏసీబీ కోర్టులో సవాలు చేశారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిగింది. వివిధ కోర్టులలో కేసులు ఉండటంతో 3 ములాఖత్‌లు ఇవ్వాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోరారు.


పిటిషన్‌ను పరిశీలించిన న్యాయమూర్తి 2 ములాఖత్‌లకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు రాజమండ్రి జైలు అధికారులకు ఏసీబీ కోర్ట్ ఆదేశాలు పంపించింది.

Updated Date - 2023-10-20T18:11:41+05:30 IST