Ayyannapatrudu : కొడాలి నాని ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి

ABN , First Publish Date - 2023-09-26T20:56:53+05:30 IST

వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని(Kodali Nani)పై టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు(Ayyannapatrudu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Ayyannapatrudu : కొడాలి నాని ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి

అమరావతి: వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని(Kodali Nani)పై టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు(Ayyannapatrudu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం నాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘కొడాలి నానికి సంస్కారం లేదు. కొడాలి నాని ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి.చంద్రబాబు చేసిన అభివృద్ధి.. కొడాలి వంటి సన్నాసులకు కనబడదు. పిచ్చి వాగుడుతో వైసీపీ నేతలు శునకానందం పొందుతున్నారు. హరికృష్ణకు టీలు మోసిన కొడాలి నాని ఇప్పుడు.. నందమూరి కుటుంబాన్ని టార్గెట్ చేశారు. ఆయనకు ఓటేసినందుకు ప్రజలు సిగ్గుపడుతున్నారు. రింగ్ లేదు.. రోడ్డు లేదు.. అదేం కేసు..? లోకేష్ పాదయాత్ర ప్రారంభిస్తానంటే.. రిపేర్ల పేరుతో రాజమండ్రి బ్రిడ్జిని మూసేశారు’’ అని అయ్యన్నపాత్రుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-09-26T20:56:53+05:30 IST