AP News: డెంగ్యూ జ్వరాలతో అల్లాడుతున్న పున్నవెల్లి గ్రామస్తులు.. తొంగిచూడని అధికారులు

ABN , First Publish Date - 2023-08-24T15:51:28+05:30 IST

జిల్లాలోని పున్నవెల్లి గ్రామ ప్రజలు డెంగ్యూ జ్వరాలతో అల్లాడిపోతున్నారు.

AP News: డెంగ్యూ జ్వరాలతో అల్లాడుతున్న పున్నవెల్లి గ్రామస్తులు.. తొంగిచూడని అధికారులు

ఎన్టీఆర్ జిల్లా: జిల్లాలోని పున్నవెల్లి గ్రామ ప్రజలు డెంగ్యూ జ్వరాలతో అల్లాడిపోతున్నారు. గ్రామంలో పది రోజులుగా విషపు జ్వరాలు, డెంగ్యూ జ్వరాలతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో ప్రతి ఇంటికి ముగ్గురు నలుగురు చొప్పున ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ప్రతి ఇంటిలోనూ పేషెంట్లు చేతికి నూడిల్ పెట్టుకొని చికిత్స పొందుతున్న వైనం కలవరానికి గురిచేస్తోంది. లక్షల రూపాయలు ఖర్చుపెట్టిన జ్వరాలు తగ్గక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో పారిశుధ్యం సరిగా లేవని, బ్లీచింగ్ చల్లేవారు కూడా లేరని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటి వరకు అధికారులు నాయకులు ఈ గ్రామం వైపు చూడకపోవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

Updated Date - 2023-08-24T15:51:28+05:30 IST