Tirupati: 17 నుంచి తిరుపతికి ప్రత్యేక బస్సులు
ABN , First Publish Date - 2023-09-15T08:55:56+05:30 IST
తిరుమల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 17 నుంచి తిరుపతి(Tirupati)కి ప్రత్యేక బస్సులను నడుపనున్నట్టు రాష్ట్ర రవాణా శాఖ ఉన్నతాధికారులు

అడయార్(చెన్నై): తిరుమల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 17 నుంచి తిరుపతి(Tirupati)కి ప్రత్యేక బస్సులను నడుపనున్నట్టు రాష్ట్ర రవాణా శాఖ ఉన్నతాధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర రవాణా శాఖ ఆధ్వర్యంలో చెన్నై, తిరుచ్చి, తంజావూరు, సేలం, కోయంబత్తూరు, మదురై, కారైక్కుడి, కుంభకోణం, పుదుచ్చేరి ప్రాంతాల నుంచి తిరుపతికి ఈ నెల 17వ తేదీ నుంచి ప్రత్యేక బస్సులు నడిపేలా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ బస్సుల్లో ప్రయాణించాలనుకునేవారు ‘www.tnstc.in’ అనే వెబ్సైట్లో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు.