Amberpet CI Sudhakar: నకిలీ ఎమ్మార్వోను సృష్టించి.. అంబర్‌పేట సీఐ సుధాకర్ ఏం చేశాడంటే?

ABN , First Publish Date - 2023-01-13T18:32:50+05:30 IST

మహేశ్వరంలో ల్యాండ్ ఇప్పిస్తానని నకిలీ ఎమ్మార్వోను సృష్టించి ఎన్ఆర్ఐ దగ్గర నుంచి సీఐ సుధాకర్ డబ్బులు కొట్టేశారు.

Amberpet CI Sudhakar: నకిలీ ఎమ్మార్వోను సృష్టించి.. అంబర్‌పేట సీఐ సుధాకర్ ఏం చేశాడంటే?
Amberpet CI Sudhakar

హైదరాబాద్: భూ వివాదంలో అంబర్ పేట ఇన్స్పెక్టర్ సుధాకర్‌ను అరెస్ట్ అయ్యారు. ల్యాండ్ రిజిస్ట్రేషన్ పేరుతో ఎన్‌ఆర్ఐని మోసం చేశారనే ఆరోపణలతో ఆయనపై వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. సస్పెండెడ్ ఆర్ఐతో కలిసి ల్యాండ్ సెటిల్‌మెంట్ చేసినట్లు తేలింది. ఎన్‌ఆర్‌ఐ నుంచి సుధాకర్‌ 54 లక్షలు తీసుకున్నట్లు నిరూపణ అయింది. మహేశ్వరంలో ల్యాండ్ ఇప్పిస్తానని నకిలీ ఎమ్మార్వోను సృష్టించి ఎన్ఆర్ఐ దగ్గర నుంచి సీఐ సుధాకర్ డబ్బులు కొట్టేశారు. పోలీసులు విచారణ జరిపి సుధాకర్‌ను అరెస్ట్ చేశారు.

సస్పెండైన ఆర్ఐ రాజేష్‌పై వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇప్పటికే కేసు నమోదు చేశారు. కందుకూరు లిమిట్స్‌లోని నేదునూరు గ్రామంలో సర్వేనెంబర్ 54/2 లో ఉన్న పది ఎకరాల ల్యాండ్ ఇప్పిస్తానని చెప్పి బి.ఎన్.రెడ్డి ఎస్ కే డి నగర్ కు చెందిన విజయ కుమార్ అనే వ్యక్తి వద్ద నుంచి 54.5 లక్షల రూపాయలు తీసుకొని నెలలు గడుస్తున్నా ల్యాండ్ ఇప్పించకపోవడంతో బాధితులు వనస్థలిపురం పి ఎస్ లో ఫిర్యాదు చేశారు. పలు ఆరోపణలతో సస్పెండైన అర్ ఐ తాను ఎమ్మార్వోనంటూ నకిలీ ఐడి కార్డ్ సృష్టించి త్వరలో ప్రమోషన్ ద్వారా ఆర్డీఓ అవుతానని నమ్మబలికి మోసాలకు పాల్పడుతున్నాడు. రాజేశ్ తమ నుంచి తీసుకున్న 54.5 లక్షల రూపాయలను సిఐ సుధాకర్‌కు ఇచ్చినట్లు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితులకు ఇప్పిస్తానన్న ల్యాండ్.. ఆర్ ఐ రాజేష్ సోదరుడు గతంలోనే కొనుగోలు చేశాడని చెప్పి దానిపై ధరణి పోర్టల్ లోగో తో నకిలీ డాక్యుమెంట్ సృష్టించి ఈ ల్యాండ్ అమ్ముతారంటూ తమ దగ్గర డబ్బులు వసూలు చేశాడని ఫిర్యాదులో తెలిపారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు ఫిర్యాదు చేశారు.

Updated Date - 2023-01-13T19:08:09+05:30 IST