Share News

Adala Prabhakar Reddy: అజ్ఞాతంలోకి ఆదాల.. ఛోటామోటా నేతలు, కార్యకర్తల ఆగ్రహం..

ABN , Publish Date - Jun 07 , 2024 | 12:45 PM

మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఆయన అల్లుడు కిరణ్ రెడ్డి ఎన్నికల ఫలితాల తరువాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కనీసం ఫోనుల్లో కూడా అందుబాటులోకి రాకపోవడంతో చోటామోటా నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకి ముందు కేసుల పేరుతో బెదిరించి పలువురిని ఆదాల అండ్ బ్యాచ్ వైసీపీలో చేర్చుకుంది.

Adala Prabhakar Reddy: అజ్ఞాతంలోకి ఆదాల.. ఛోటామోటా నేతలు, కార్యకర్తల ఆగ్రహం..

నెల్లూరు: మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఆయన అల్లుడు కిరణ్ రెడ్డి ఎన్నికల ఫలితాల తరువాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కనీసం ఫోనుల్లో కూడా అందుబాటులోకి రాకపోవడంతో చోటామోటా నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకి ముందు కేసుల పేరుతో బెదిరించి పలువురిని ఆదాల అండ్ బ్యాచ్ వైసీపీలో చేర్చుకుంది. ఆదాల అందుబాటులో లేకపోవడం ఆయన ముఖ్య అనుచరులు కొండ్రెడ్డి రంగారెడ్డి, వైవీ రామిరెడ్డి, హరీష్‌లకి శ్రేణుల నుంచి ఫోన్లు వెళుతున్నాయి. బెదిరించి వైసీపీలో చేర్చుకుని తమ జీవితాలు నాశనం చేశారంటూ వైసీపీ నేత జగదీశ్ తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు. ఈ ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

CS Javahar Reddy: అమ్మ.. జవహరా!

AP News: స్పీకర్ రేసులో ఉన్నది వీరే..?

For more AP News and Telugu News

Updated Date - Jun 07 , 2024 | 12:45 PM