Share News

సమగ్ర యాజమాన్యంతో అధిక దిగుబడులు

ABN , Publish Date - Oct 22 , 2024 | 11:17 PM

సమగ్ర యాజమాన్య చర్యలతో అరటిలో అధికదిగుబడులు సాధించవచ్చని మండల వ్యవసాయాధికారి రమేష్‌ తెలిపారు.

సమగ్ర యాజమాన్యంతో అధిక దిగుబడులు
మాట్లాడుతున్న ఏఓ రమేష్‌

లింగాల, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): సమగ్ర యాజమాన్య చర్యలతో అరటిలో అధికదిగుబడులు సాధించవచ్చని మండల వ్యవసాయాధికారి రమేష్‌ తెలిపారు. మండలంలోని మురారిచింతల గ్రామంలో మంగళవారం పొలంపిలుస్తోంది కార్యక్రమంలో ఆయన రైతులతో మాట్లాడుతూ సమగ్రయాజమాన్య చర్యలతోపాటు ప్రకృతి వ్యవసాయం చేయాలనిపిలుపునిచ్చారు. అలాగే లింగాలలో రైతులకు 350క్వింటాళ్ల విత్తన శనగలను పంపిణీ చేశామని తెలిపారు. ఇప్పటి వరకు 981క్వింటాళ్ల శనగలను రైతులకు పంపిణీ చేశామని తెలిపారు. విత్తన శనగలు పొందిన ప్రతి రైతుపంటను తప్పనిసరిగా సాగుచేయాలన్నారు.

Updated Date - Oct 22 , 2024 | 11:17 PM