Share News

Kadambari Jethwani: హీరోయిన్ జిత్వానీ వ్యవహారంలో కీలక పరిణామం.. ఈ రాత్రికి హైదరాబాద్‌కు రాక

ABN , Publish Date - Aug 29 , 2024 | 05:22 PM

ముంబై హీరోయిన్ కాదంబరి జెత్వానీకి వైసీపీ టార్చర్ వ్యవహారంలో కీలక అప్‌డేట్ వచ్చింది. ఆమె ఈ రోజు రాత్రికి ముంబై నుంచి హైదరాబాద్‌కు రానున్నారు. రాత్రి 8.30 గంటలకు ముంబైలో బయలుదేరి రాత్రి 9.30 గంటలకు హైదరాబాద్ చేరుకోనున్నారు. అక్కడి నుంచి ఏపీ పోలీసులు రక్షణతో ఆమెను విజయవాడకు తీసుకొచ్చే అవకాశం ఉంది.

Kadambari Jethwani: హీరోయిన్ జిత్వానీ వ్యవహారంలో కీలక పరిణామం.. ఈ రాత్రికి హైదరాబాద్‌కు రాక

అమరావతి: ముంబై హీరోయిన్ కాదంబరి జెత్వానీకి వైసీపీ టార్చర్ వ్యవహారంలో కీలక అప్‌డేట్ వచ్చింది. ఆమె ఈ రోజు రాత్రికి ముంబై నుంచి హైదరాబాద్‌కు రానున్నారు. రాత్రి 8.30 గంటలకు ముంబైలో బయలుదేరి రాత్రి 9.30 గంటలకు హైదరాబాద్ చేరుకోనున్నారు. అక్కడి నుంచి ఏపీ పోలీసులు రక్షణతో ఆమెను విజయవాడకు తీసుకొచ్చే అవకాశం ఉంది. వైసీపీ టార్చర్ వ్యవహారానికి సంబంధించి కాదంబరి జెత్వానీ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయాలని విజయవాడ పోలీసులు భావిస్తున్నారు. అందుకే ఆమెను తీసుకొస్తున్నారు.


ఈరోజు రాత్రికి హైదరాబాద్‌కు తీసుకొచ్చి అక్కడి నుంచి నేరుగా జెత్వానీతో మాట్లాడిన అనంతరం విజయవాడకు తీసుకు వచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. జెత్వానీ న్యాయవాదులు, ఆమె కుటుంబ సభ్యులతో విజయవాడ నగర పోలీసు కమీషనర్ మాట్లాడుతున్నారు. దర్యాప్తు అధికారిగా ఉన్న డాక్టర్ స్రవంతి రాయ్‌తో కూడా జెత్వానీ ఫోన్‌లో మాట్లాడారు. కేసు వివరాలను, సాక్ష్యాలను, అప్పట్లో చేసిన చిత్ర హింసలకు సంబంధించిన వివరాలను తమకు వివరించాలని స్రవంతి రాయ్ కోరారు.


సీపీ రాజశేఖర్ బాబు కీలక వ్యాఖ్యలు

నటి కాదంబరి జెత్వానీకి వైసీపీ టార్చర్ వ్యవహారంపై విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. నటి జెత్వానీ కేసులో ఐపీఎస్ అధికారుల పాత్ర ఉందంటూ కథనాలు వస్తున్నాయని, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు వివరాలు పరిశీలిస్తున్నామని వెల్లడించారు. డీజీపీ ఈ కేసు వివరాలపై ఆరా తీశారని పేర్కొన్నారు.


‘‘స్రవంతి రాయ్ అనే అధికారిని విచారణ కోసం నియమించాం. బాధితురాలితో మాట్లాడి పూర్తి వివరాలు తీసుకుంటాం. చీటింగ్ కేసులో నటితో పాటు కుటుంబం మొత్తాన్ని ఎందుకు అరెస్టు చేశారో ఆరా తీస్తాం. ఆ రోజు ఎవరెవరి పాత్ర ఎంతవరకు ఉందో దర్యాప్తులో తేలుతుంది. నాలుగైదు రోజుల్లో ఈ విచారణ పూర్తవుతుంది. మొత్తం ఈ కేసులో అన్ని కోణాల్లో సాంకేతికతతో ఆధారాలు సేకరిస్తాం. నివేదిక రూపంలో డీజీపీకి అందచేస్తాం. ఐపీఎస్‌ల పాత్ర ఉన్నట్లు తేలితే డీజీపీ చర్యలు తీసుకుంటారు’’ అని సీపీ రాజశేఖర్ బాబు స్పష్టం చేశారు.

Updated Date - Aug 29 , 2024 | 05:38 PM