రెనో, బీఎండబ్ల్యూ కార్ల ధరలు పెంపు
ABN , Publish Date - Mar 21 , 2025 | 01:51 AM
మరో రెండు కంపెనీలు కూడా ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి తమ కార్ల ధరలు పెంచుతున్నట్టు ప్రకటించాయి...

న్యూఢిల్లీ: మరో రెండు కంపెనీలు కూడా ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి తమ కార్ల ధరలు పెంచుతున్నట్టు ప్రకటించాయి. వాటిలో ఒకటి రెనో కాగా రెండోది లగ్జరీ కార్ల కంపెనీ బీఎండబ్ల్యూ. పెరిగిపోతున్న ముడి సరుకు వ్యయ భారాన్ని కొంతైనా తగ్గించుకునేందుకు ధరలు పెంచక తప్పలేదని రెండు కంపెనీలు ప్రకటించాయి. తమ కార్ల ధరలు ఏప్రిల్ 1 నుంచి 2 శాతం వరకు పెంచుతున్నట్టు రెనో వెల్లడించగా.. తమ కార్ల ధరలు 3 శాతం వరకు పెంచుతున్నట్టు బీఎండబ్ల్యూ ప్రకటించింది.
Also Read:
Pawan Kalyan : ఎస్సీ వర్గీకరణ ఈ స్థాయికి వచ్చిందంటే.. వారే కారణం
CM Nitish Kumar: అసెంబ్లీలో ఏమిటిది అధ్యక్ష్యా..
For Business News And Telugu News