Share News

Komatireddy Rajagopal Reddy: ఏపీ ఎన్నికల ఫలితాలపై కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , Publish Date - Jun 01 , 2024 | 12:57 PM

ఏపీ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. నేడు ఆయన తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారా..? లేక వైసీపీకీ పట్టం కడతారోనన్న ఉత్కంఠ నెలకొందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు.

Komatireddy Rajagopal Reddy: ఏపీ ఎన్నికల ఫలితాలపై కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

తిరుమల: ఏపీ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. నేడు ఆయన తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారా..? లేక వైసీపీకీ పట్టం కడతారోనన్న ఉత్కంఠ నెలకొందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఏపీలో ప్రజల నాడి ఎవరికీ అంతుబట్టడం లేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్.. బీజేపీ మధ్య హోరా హోరీ పోరు జరిగిందన్నారు.

Hyderabad: ట్యాంక్‌బండ్‌, పరేడ్‌ గ్రౌండ్‌ పరిసరాల్లో.. ట్రాఫిక్‌ ఆంక్షలు


తెలంగాణలో బీజేపీ.. కాంగ్రెస్ సమాన సీట్లు గెలుచుకునే అవకాశం ఉందన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ తుడుచు పెట్టుకుపోయిందన్నారు. భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి కిరణ్ కచ్చితంగా గెలుస్తాడన్నారు. దేశంలో మొదట్లో బీజేపీ హావా కొనసాగగా..అటు తరువాత ఉత్తరాదిన కాంగ్రెస్, ఇండియా కూటమి బాగా పుంజుకుందన్నారు. భవిష్యత్‌ని నిర్ణయించే ఎన్నికలు కాబట్టి ప్రజలు మంచి తీర్పు ఇస్తారని ఆశిస్తున్నానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు.

Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Updated Date - Jun 01 , 2024 | 02:01 PM