Share News

Kesineni Swetha: కార్పొరేటర్ పదవికి కేశినేని శ్వేత రాజీనామా

ABN , Publish Date - Jan 08 , 2024 | 12:05 PM

Andhrapradesh: కార్పొరేటర్ పదవికి ఎంపీ కేశినేని నాని కూతురు కేశినేని శ్వేత రాజీనామా చేశారు. సోమవారం విజయవాడ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్ళిన శ్వేత.. మేయర్ రాయన భాగ్యలక్ష్మిని కలిసి కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు శ్వేత పేర్కొన్నారు.

Kesineni Swetha: కార్పొరేటర్ పదవికి కేశినేని శ్వేత రాజీనామా

విజయవాడ, జనవరి 8: కార్పొరేటర్ పదవికి ఎంపీ కేశినేని నాని కూతురు కేశినేని శ్వేత (Kesineni Swetha) రాజీనామా చేశారు. సోమవారం విజయవాడ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్ళిన శ్వేత.. మేయర్ రాయన భాగ్యలక్ష్మిని కలిసి కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. తన రాజీనామా ఆమోదించాలని కేశినేని శ్వేత కోరారు.


మరోవైపు కార్పొరేటర్ పదవికి కేశినేని శ్వేత రాజీనామా చేస్తున్న విషయాన్ని తండ్రి కేశినేని నాని ముందుగానే చెప్పారు. ఈరోజు ఉదయం ఫేస్‌‌బుక్ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు. శ్వేత మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లి... తన కార్పొరేటర్ పదవికి రాజీనామా చేస్తారని, ఆ తర్వాత టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తారని ఆయన పేర్కొన్నారు. అన్నట్టుగానే కార్పొరేటర్ పదవికి శ్వేత రాజీనామా చేశారు.

కాగా.. త్వరలోనే ఢిల్లీకి వెళ్లి తన లోక్‌సభ సభ్యత్వంతో పాటు తెలుగుదేశం పార్టీకి సైతం రాజీనామా చేస్తానని ఇప్పటికే కేశినేని నాని ప్రకటించిన విషయం తెలిసిందే.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 08 , 2024 | 12:14 PM