Share News

Kakani Govardhan: టీడీపీ అనుకున్న ప్రకారం దర్యాప్తు సంస్థలు పని చేయాలా?

ABN , Publish Date - Feb 07 , 2024 | 03:19 PM

Andhrapradesh: ఒక కేసు విషయంలో ఫైల్స్ మాయంపై సీబీఐ విచారణ ఏడాది పాటు జరిగిందని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. సీబీఐ విచారణను కూడా టీడీపీ నేత సోమిరెడ్డి తప్పు పడుతున్నారన్నారు.

Kakani Govardhan: టీడీపీ అనుకున్న ప్రకారం దర్యాప్తు సంస్థలు పని  చేయాలా?

అమరావతి, ఫిబ్రవరి 7: ఒక కేసు విషయంలో ఫైల్స్ మాయంపై సీబీఐ విచారణ ఏడాది పాటు జరిగిందని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి (Minister Kakani Goverdhar Reddy) అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. సీబీఐ విచారణను కూడా టీడీపీ నేత సోమిరెడ్డి తప్పు పడుతున్నారన్నారు. సీబీఐ అంటే చంద్రబాబు (TDP Chief Chandrababu naidu) విచారణ కాదన్నారు. చంద్రబాబు, లోకేష్ , సోమిరెడ్డి ముగ్గురూ తనను కోర్టు దొంగ అని మాట్లాడారని.. టీడీపీ అనుకున్న ప్రకారం దర్యాప్తు సంస్థలు పని చేయాలా? అని ప్రశ్నించారు. చంద్రబాబు తనపై ఒక్క కేస్‌లో అయినా సీబీఐ విచారణకు సిద్ధంగా ఉన్నారా అని నిలదీశారు. రాష్ట్రంలో సీబీఐ అడుగు పెట్టడానికి వీల్లేదని గతంలో చంద్రబాబు చెప్పారని గుర్తుచేశారు. చంద్రబాబు పొత్తుల గురించి తాము ఆలోచించడం లేదన్నారు. చంద్రబాబు మోసపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. చంద్రబాబు, పవన్, బీజేపీ కలిసి వస్తున్నారంటే వైసీపీ బలం ఏంటో తెలుస్తోందన్నారు. ఏ చిన్నాచితకా పార్టీ వచ్చినా చంద్రబాబు కలుస్తారని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 07 , 2024 | 03:22 PM