Share News

YSRCP - Roja: ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మంత్రి రోజా!

ABN , Publish Date - Jan 28 , 2024 | 02:59 AM

అధికార వైసీపీ ఒంగోలు లోక్‌సభ స్థానం నుంచి మంత్రి ఆర్‌కే రోజాను రంగంలోకి దించాలని చూ స్తోంది. ఆ మేరకు ప్రకాశం జిల్లా నాయకులకు ఆ పార్టీ నేత విజయసాయిరెడ్డి సమాచారం ఇచ్చారు.

YSRCP - Roja: ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మంత్రి రోజా!

జిల్లా నేతలకు సమాచారమిచ్చిన విజయసాయిరెడ్డి

(ఒంగోలు - ఆంధ్రజ్యోతి)

అధికార వైసీపీ ఒంగోలు లోక్‌సభ స్థానం నుంచి మంత్రి ఆర్‌కే రోజాను రంగంలోకి దించాలని చూ స్తోంది. ఆ మేరకు ప్రకాశం జిల్లా నాయకులకు ఆ పార్టీ నేత విజయసాయిరెడ్డి సమాచారం ఇచ్చారు. సీఎం జగన్‌ కాదన్నా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డితో వైసీపీ నాయకులు మంతనాలు ప్రా రంభించిన నేపథ్యంలో అధిష్ఠానం రోజా పేరు ప్రతిపాదించటం విశేషం. తాను పెట్టిన షరతులకు అంగీకరించని ఎంపీ మాగుంటకు తిరిగి టికెట్‌ ఇచ్చేది లేదని జగన్‌ తేల్చిచెప్పిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా మాగుంటకు టికెట్‌ ఇప్పించేందుకు మాజీ మంత్రి బాలినేని ప్రయత్నించి విఫలమయ్యా రు. ఆ తర్వాత చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పేరును ఒంగోలు ఎంపీ స్థానానికి అధిష్ఠానం ప్రతిపాదించింది. అయితే బాలినేనితో సహా జిల్లాలోని నాయకులు అందరూ చెవిరెడ్డిని వ్యతిరేకించారు.

‘తండ్రీకొడుకులు ఇద్దరికీ టికెట్లు ఇచ్చే విధానం లేదన్నారు కదా..! చెవిరెడ్డికి ఎలా ఇస్తారు? అలాగైతే నా కుమారుడు ప్రణీత్‌రెడ్డి కూడా పోటీకి సిద్ధంగా ఉన్నా డు’ అని విజయసాయి, సజ్జలతో బాలినేని అన్నట్లు సమాచారం. మరోవైపు శుక్రవారం ఒంగోలులో మా గుంటతో మరోసారి బాలినేని, దర్శి ఇన్‌చార్జి బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి భేటీ అయ్యారు. ‘లోక్‌సభ పరిధిలో అసెంబ్లీల నుంచి పోటీ చేయబోతున్న నాయకులు సీఎంను కలవాలి. ఎంపీ మాగుంటకు టికెట్‌ ఇచ్చే విషయాన్ని పరిశీలించాలని కోరాలి’ అన్న ఆలోచన చేశారు. అయితే ఆ బృందానికి ఎవరు నాయకత్వం వహించాలన్న విషయం దగ్గరే మీమాంస మొదలయింది. ఈ నేపఽథ్యంలో విజయసాయిరెడ్డి శనివారం బాలినేని, మంత్రి సురేశ్‌తోపాటు మరో ఇద్దరు ముగ్గురు నాయకులతో మాట్లాడారని తెలిసింది. ‘ఒంగోలు ఎంపీ అభర్థిగా రోజా పేరు పరిశీలనలో ఉంది. సోమ, మంగళవారాల్లో ఖరారు కావచ్చు’ అని సాయిరెడ్డి చెప్పినట్లు సమాచారం. దీనిపై రేపో మాపో ప్రకటన రానుంది.

Updated Date - Jan 28 , 2024 | 06:42 AM