Share News

Pawan Kalyan: నాదెండ్ల ఓకే.. పవన్ ఏమంటారో..!!

ABN , Publish Date - Jun 18 , 2024 | 11:40 AM

: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ క్యాంపు కార్యాలయం ఖరారు కావాల్సి ఉంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లిన జనసేనాని నేరుగా జలవనరుల శాఖ క్యాంపు కార్యాలయం పరిశీలించారు. తన కోసం ఏర్పాటు చేసిన క్యాంపు కార్యాలయాన్ని పవన్ కల్యాణ్ నిశీతంగా పరిశీలించారు. ఆ కార్యాలయాన్ని జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ పరిశీలించారు.

Pawan Kalyan: నాదెండ్ల ఓకే.. పవన్ ఏమంటారో..!!
Pawan Kalyan

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) క్యాంపు కార్యాలయం ఖరారు కావాల్సి ఉంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లిన జనసేనాని నేరుగా జలవనరుల శాఖ క్యాంపు కార్యాలయం పరిశీలించారు. తన కోసం ఏర్పాటు చేసిన క్యాంపు కార్యాలయాన్ని పవన్ కల్యాణ్ నిశీతంగా పరిశీలించారు. ఆ కార్యాలయాన్ని జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. కార్యాలయాన్ని పరిశీలించి, పవన్ కల్యాణ్‌కు బాగుంటుందని అభిప్రాయ పడ్డారు. ఆఫీసును పవన్ కల్యాణ్ ఈ రోజు పరిశీలించారు. పవన్ ఓకే అంటే అది ఆయన క్యాంపు కార్యాలయంగా మారుతుంది. పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా రేపు బాధ్యతలు స్వీకరిస్తారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలను పర్యవేక్షిస్తారు.


దేవినేని, బొత్స

పవన్ కల్యాణ్ కోసం పరిశీలించిన క్యాంపు కార్యాలయాన్ని గత ప్రభుత్వంలో దేవినేని ఉమమహేశ్వర రావు వినియోగించారు. ఆ సమయంలో దేవినేని జలవనరుల శాఖ బాధ్యతలను నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వంలో బొత్స సత్యనారాయణ క్యాంపు కార్యాలయంగా జలవనరుల శాఖ ఆఫీసు ఉంది. ఇప్పుడు పవన్ కల్యాణ్ క్యాంపు కార్యాలయంగా మారబోతుంది. పవన్ ఆమోదం తెలిపితే కార్యాలయం అవుతుంది. లేదంటే మరో భవనాన్ని పరిశీలిస్తారు. ఇప్పటికే నాదెండ్ల మనోహర్ పరిశీలించి బాగుందని చెప్పడంతో పవన్ కల్యాణ్ కూడా అంగీకరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.


సచివాలయం

క్యాంపు కార్యాలయం పరిశీలించిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జనసేన కేంద్ర కార్యాలయానికి వెళతారు. అక్కడ పార్టీ నేతలతో మాట్లాడతారు. అక్కడే భోజనం చేస్తారు. మధ్యాహ్నం సచివాలయానికి వస్తారు. అక్కడ తనకు కేటాయించిన బ్లాక్‌ను పవన్ కల్యాణ్ పరిశీలిస్తారు.

ఈ వార్తలు కూడా చదవండి..


కోడెల చేస్తే తప్పు.. జగన్‌ చేస్తే ఒప్పా?

కూడబలుక్కుని కూల్చేశారు!

Updated Date - Jun 18 , 2024 | 11:45 AM