Share News

Road Accident: కాణిపాకం నుంచి వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు స్నేహితుల మృతి

ABN , Publish Date - Jun 15 , 2024 | 08:30 AM

బెంగళూరు.. తిరుపతి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓకే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు మృతి చెందారు. స్నేహితుని జన్మదినానికి కోసం కాణిపాకం నుంచి బైక్‌పై కేక్ తీసుకొస్తుండగా చెర్లోపల్లి సమీపంలో మినీ లారీని బైక్ ఢీ కొట్టింది. బంగారుపాలెం మండలం మహాసముద్రం గ్రామానికి చెందిన పవన్, మంజు, చరణ్ ముగ్గురు స్నేహితులు మృతి చెందారు.

Road Accident: కాణిపాకం నుంచి వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు స్నేహితుల మృతి

చిత్తూరు: బెంగళూరు.. తిరుపతి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓకే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు మృతి చెందారు. స్నేహితుని జన్మదినానికి కోసం కాణిపాకం నుంచి బైక్‌పై కేక్ తీసుకొస్తుండగా చెర్లోపల్లి సమీపంలో మినీ లారీని బైక్ ఢీ కొట్టింది. బంగారుపాలెం మండలం మహాసముద్రం గ్రామానికి చెందిన పవన్, మంజు, చరణ్ ముగ్గురు స్నేహితులు మృతి చెందారు. రాంగ్ రూట్‌లో వస్తున్న ఈచర్ వాహనాన్ని ఢీకొని సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మృతదేహాలను చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తాలుకా పోలీసులు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jun 15 , 2024 | 08:30 AM