ఫారినర్లు నెట్టింట అత్యధికంగా సెర్చ్ చేసిన భారతీయ పర్యాటక ప్రాంతాలు ఇవే!

ABN, Publish Date - Oct 19 , 2024 | 04:36 PM

ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం ఊపందుకుంటోంది. అనేక మంది విదేశీయులు భారత్‌వైపు క్యూకడుతున్నారు. విదేశీయులు అత్యధికంగా సెర్చ్ చేసిన టూరిస్టు స్థలాలు ఏవో తెలుసుకునేందుకు బుకింగ్స్ డాట్ కామ్ ఓ సర్వే నిర్వహించింది. ఇందులో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.

ఫారినర్లు నెట్టింట అత్యధికంగా సెర్చ్ చేసిన భారతీయ పర్యాటక ప్రాంతాలు ఇవే! 1/12

ప్రాచీన, ఆధునిక సంస్కృతుల మేలు కలయికగా నిలిచి ఢిల్లీ ఈ జాబితాలో ముందువరుసలో నిలిచింది. రెడ్ ఫోర్ట్, ఇండియా గేట్, కుతుబ్ మినార్ వంటి స్థలాలు వీక్షించేందుకు, స్థానిక వంటకాలు రుచి చూసేందుకు ఫారినర్లు ఉత్సుకత చూపుతున్నారు.

ఫారినర్లు నెట్టింట అత్యధికంగా సెర్చ్ చేసిన భారతీయ పర్యాటక ప్రాంతాలు ఇవే! 2/12

దేశ ఆర్థిక రాజధాని ముంబై కూడా విదేశీయులను అధికంగా ఆకర్షిస్తోంది. బాలీవుడ్, గేట్ వే ఆఫ్ ఇండియా, స్ట్రీట్ లైఫ్‌ తదితరాల గురించి తెలుసుకునేందుకు విదేశీయులు ఆసక్తి కనబరిచారు. ఇక్కడి సంస్కృతి, చరిత్ర వంటి వాటిపై ఆసక్తితో అధిక సంఖ్యలో తరలివస్తున్నారు.

ఫారినర్లు నెట్టింట అత్యధికంగా సెర్చ్ చేసిన భారతీయ పర్యాటక ప్రాంతాలు ఇవే! 3/12

భారతీయ సిలికాన్ వ్యాలీగా పేరుపడ్డ బెంగళూరుకు కూడా ఫారిన్ టూరిస్టుల తాకిడి ఎక్కువగానే ఉంది. ఇక్కడి పార్కులు, చారిత్రాత్మక స్థలాలు, బెంగళూరు ప్యాలెస్, స్థానిక వంటకాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.

ఫారినర్లు నెట్టింట అత్యధికంగా సెర్చ్ చేసిన భారతీయ పర్యాటక ప్రాంతాలు ఇవే! 4/12

పింక్ సిటీగా పేరు పొందిన జైపూర్ నగరంపై విదేశీయులు ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక్కడి అంబర్ కోట, హవా మహల్ వంటి చారిత్రక నిర్మాణాల వైభవం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఒకప్పటి రాచరిక వైభవం చూసేందుకు విదేశీయులు ఇక్కడకు క్యూ కడుతున్నారు.

ఫారినర్లు నెట్టింట అత్యధికంగా సెర్చ్ చేసిన భారతీయ పర్యాటక ప్రాంతాలు ఇవే! 5/12

తీర నగరమైన చెన్నై దేవాలయాలకు ప్రసిద్ధి. ఇక్కడి మెరీనా బీచ్, దక్షిణాది వంటకాలు కూడా బాగా పాప్యులర్, దీంతో, చెన్నైకి కూడా విదేశీయుల రాక ఎక్కువ. అనేక మంది ఫారినర్లు ఈ దర్శనీయ ప్రాంతం గురించి తెలుసుకునేందుకు అంతర్జాలంలో సెర్చ్ చేశారు.

ఫారినర్లు నెట్టింట అత్యధికంగా సెర్చ్ చేసిన భారతీయ పర్యాటక ప్రాంతాలు ఇవే! 6/12

యూనెస్కో సాంస్కృతిక వారసత్వమైన హంపీ నగరం గురించి తెలుసుకునేందుకు ఫారిన్ టూరిస్టులు ఉత్సుకత ప్రదర్శిస్తున్నట్టు సర్వేలో తేలింది. విజయనగర సామ్రాజ్య వైభవాన్ని తెలియజేసే చారిత్రక కట్టడాలు ఫారినర్లను అధికంగా ఆకర్షిస్తున్నాయి

ఫారినర్లు నెట్టింట అత్యధికంగా సెర్చ్ చేసిన భారతీయ పర్యాటక ప్రాంతాలు ఇవే! 7/12

హిమాలయాల్లోని లేహ్ ప్రాంతం కూడా ప్రకృతి అందాలకు ప్రసిద్ధి. ఇక్కడి కొండల్లో ట్రెక్కింగ్ చేసేందుకు కూడా ఫారినర్లు కూడ కడుతున్నారు. ఇక్కడి మతపరమైన కట్టడాలు వీక్షించేందుకు బారులు తీరుతున్నారు.

ఫారినర్లు నెట్టింట అత్యధికంగా సెర్చ్ చేసిన భారతీయ పర్యాటక ప్రాంతాలు ఇవే! 8/12

జమ్ముకశ్మీర్‌లోని ప్రఖ్యాత హిల్ స్టేషన్ గురించి కూడా విదేశీయులు నెట్టింట అత్యధికంగా సెర్చ్ చేశారు. ప్రకృతి ప్రేమికులు, అడ్వెంచర్ క్రీడలు ఇష్టపడే ఫారినర్లు ఇక్కడికి పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.

ఫారినర్లు నెట్టింట అత్యధికంగా సెర్చ్ చేసిన భారతీయ పర్యాటక ప్రాంతాలు ఇవే! 9/12

అద్భుతమైన కొండలు, లోయలు, నదులతో ప్రకృతి రమణీయతకు చిహ్నంగా నిలుస్తున్న పహల్గామ్ కూడా ఫారినర్లు సందర్శిస్తున్న స్థలాల్లో ప్రధానమైనది. అమర్‌నాథ్ యాత్ర ప్రారంభమయ్యే కూడా ఇక్కడి నుంచే!

ఫారినర్లు నెట్టింట అత్యధికంగా సెర్చ్ చేసిన భారతీయ పర్యాటక ప్రాంతాలు ఇవే! 10/12

కూర్గ్ జిల్లాలోని మాడికేరీ కాఫీ పంటలకు ప్రసిద్ధి. ఇక్కడి ప్రకృతి అందాలు, జలపాతాలు చూసేందుకు జనాలు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. ట్రెక్కింగ్ వంటి అడ్వెంచర్ స్పోర్ట్స్ ఇష్టపడే ఫారినర్లకు ఇది స్వర్గధామంగా మారిందనడంలో అతిశయోక్తి లేదు

ఫారినర్లు నెట్టింట అత్యధికంగా సెర్చ్ చేసిన భారతీయ పర్యాటక ప్రాంతాలు ఇవే! 11/12

కృష్ణానది తీరాన ఉన్న విజయవాడ ఎన్నో ప్రముఖ దేవాలయాలకు ప్రసిద్ధి గాంచింది. దుర్గ గుడి చూసేందుకు స్థానిక సంస్కృతి సంప్రదాయాల గురించి తెలుసుకునేందుకు కూడా విదేశీయులు విజయవాడ గురించి నెట్టింట అధికంగా సెర్చ్ చేస్తుంటారట.

ఫారినర్లు నెట్టింట అత్యధికంగా సెర్చ్ చేసిన భారతీయ పర్యాటక ప్రాంతాలు ఇవే! 12/12

భారతీయ శిల్పకళావైభవానికి ప్రతీకగా ఉన్న ఖజురహో.. ఫారినర్లను అమితంగా ఆకర్షిస్తుంటుంది. ఎన్నో దేవాలయాలు ఉన్న దీనికి యూనెస్కో సాంస్కృతిక వారసత్వ హోదా దక్కడంతో విదేశీయులు ఇక్కడకు కూడా క్యూకడుతుంటారని బుకింగ్స్ డాట్ కామ్ సర్వేలో తేలింది.

Updated at - Oct 19 , 2024 | 04:39 PM