Share News

Bomb Explosion: మీర్జాపూర్‌లో నాటు బాంబు పేలి రైతుకు తీవ్రగాయాలు..

ABN , Publish Date - Aug 05 , 2024 | 11:17 AM

నాటు బాంబు పేలి(Bomb Explosion) ఓ వ్యక్తికి తీవ్రగాయాలు అయిన ఘటన హుస్నాబాద్ మండలం మీర్జాపూర్‌(Mirzapur)లో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన యువరైతు కలీం వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్లారు. పనుల చేస్తున్న సమయంలో గేదెను కట్టేసేందుకు వ్యవసాయ బావి వద్దకు వెళ్లారు.

Bomb Explosion: మీర్జాపూర్‌లో నాటు బాంబు పేలి రైతుకు తీవ్రగాయాలు..

సిద్దిపేట: నాటు బాంబు పేలి(Bomb Explosion) ఓ వ్యక్తికి తీవ్రగాయాలు అయిన ఘటన హుస్నాబాద్ మండలం మీర్జాపూర్‌(Mirzapur)లో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన యువరైతు కలీం వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్లారు. పనుల చేస్తున్న సమయంలో గేదెను కట్టేసేందుకు వ్యవసాయ బావి వద్దకు వెళ్లారు. గేదెను కట్టేసేందుకు భూమిలో మేకులు కొడుతుండగా ఒక్కసారిగా నాటు బాంబు పేలింది.


దీంతో రైతు కలీంకు తీవ్రగాయాలు అయ్యాయి. బాధితుడిని చికిత్స నిమిత్తం తోటి రైతులు హుటాహుటిన వరంగల్ ఆస్పత్రికి తరలించారు. అడవి పందుల కోసం వేటగాళ్లు బాంబును పెట్టినట్లుగా గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని చోట్ల ఇంకా పెట్టి ఉంటారేమో అని భయాందోళనకు గురవుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఈ వార్త కూడా చదవండి:

Children Missing: తెలంగాణలో పెరిగిపోతున్న చిన్నారుల కిడ్నాప్ కేసులు..

Updated Date - Aug 05 , 2024 | 11:18 AM