Share News

Bodhan: బోధన్‌లో రెచ్చిపోయిన యువకులు.. మరో వర్గంపై కత్తులతో దాడి..

ABN , Publish Date - Oct 12 , 2024 | 05:43 PM

బోధన్‌లో కత్తులతో యువకులు దాడులకు తెగబడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఓ యువకుడి అపోహ ముగ్గురి ప్రాణాల మీదకు తెచ్చింది. గాంధీనగర్‌కు చెందిన రెహన్, జావిద్, బబ్లూ అనే ముగ్గురు యువకులు రోడ్డుపై నిలుచుని మాట్లాడుకుంటున్నారు.

Bodhan: బోధన్‌లో రెచ్చిపోయిన యువకులు.. మరో వర్గంపై కత్తులతో దాడి..

నిజామాబాద్: బోధన్‌లో కత్తులతో యువకులు దాడులకు తెగబడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఓ యువకుడి అపోహ ముగ్గురి ప్రాణాల మీదకు తెచ్చింది. గాంధీనగర్‌కు చెందిన రెహన్, జావిద్, బబ్లూ అనే ముగ్గురు యువకులు రోడ్డుపై నిలుచుని మాట్లాడుకుంటున్నారు. అయితే స్థానికంగా ఉంటే మన్సూర్ తన గురించే వారు మాట్లాడుకుంటున్నారని అనుకున్నాడు. అనంతరం వారి వద్ద వెళ్లి తన గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారని ప్రశ్నించారు. ఈ విషయంలో వారి మధ్య వివాదం చెలరేగింది. దీంతో అక్కడ్నుంచి ఇంటికి వెళ్లిన మన్సూర్ తన స్నేహితులు అన్వర్, బాసిత్‌కు విషయం చెప్పాడు.


కోపంతో రగిలిపోయిన ముగ్గురు యువకులు వెంటనే కత్తులు తీసుకుని దాడికి వెళ్లారు. వీరు వెళ్లే సరికి అక్కడే ఉన్న రెహన్, జావిద్, బబ్లూపై వెంటనే దాడికి తెగబడ్డారు. విచక్షణారహితంగా వారిని తీవ్రంగా గాయపరిచారు. అనంతరం అక్కడ్నుంచి పరారయ్యారు. అయితే కత్తిపోట్లకు గురైన బాధితులను స్థానికులు హుటాహుటిన ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పట్టణ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Updated Date - Oct 12 , 2024 | 05:43 PM