Share News

Delhi Liquor Case: ‘జై తెలంగాణా, జై భారత్’ అంటూ ఎమ్మెల్సీ కవిత నినాదాలు

ABN , Publish Date - Jun 03 , 2024 | 10:54 AM

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Case) నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రిమాండ్ ముగియడంతో నేడు (సోమవారం) తీహార్ జైలు అధికారులు ఆమెను రౌస్ అవెన్యూ కోర్టు ముందు హాజరుపరిచారు.

Delhi Liquor Case: ‘జై తెలంగాణా, జై భారత్’ అంటూ ఎమ్మెల్సీ కవిత నినాదాలు

ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Case) నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) రిమాండ్ ముగియడంతో నేడు (సోమవారం) తీహార్ జైలు అధికారులు ఆమెను రౌస్ అవెన్యూ కోర్టు ముందు హాజరుపరిచారు. అయితే సీబీఐ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగించాలంటూ దాఖలైన పిటిషన్‌పై ఈ రోజు (సోమవారం) మధ్యాహ్నం 2 గంటలకు విచారణ జరపనున్నట్టు కోర్టు వెల్లడించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మధ్యాహ్నం అధికారులు ప్రవేశపెట్టనున్నారు. కాగా కోర్టులోకి వస్తున్న సందర్భంలో ఎమ్మెల్సీ కవిత ‘జై తెలంగాణా, జై భారత్’ అంటూ నినాదాలు చేశారు.


మరోవైపు ఇదే కేసులో నిందితులుగా ఉన్న దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్‌లను కూడా అధికారులు కోర్టు ముందు హాజరుపరిచారు. దీంతో పాస్ పోర్టు సరెండర్ చేయాలంటూ నిందితులను కోర్టు ఆదేశించింది. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన చరణ్ ప్రీత్ కేసు విచారణను జులై 3కి రౌస్ అవెన్యూ కోర్టు వాయిదా వేసింది.

ఇవి కూడా చదవండి

Loksabha: లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ బీజేపీ భారీ అంచనాలు

TS News: మామ, బావమరిదిపై మటన్ కత్తితో అల్లుడి దాడి..

For more TS News and Telugu News

Updated Date - Jun 03 , 2024 | 11:35 AM