ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. అమిత్ షాతో భేటీ..

ABN, Publish Date - Oct 06 , 2024 | 10:32 AM

మావోయిస్టుల ఏరివేత, మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై కేంద్రం చర్చించనుంది. రోడ్ కనెక్టివిటీ, ఫోన్ కనెక్టివిటీ పెంచేలా కేంద్రం చర్యలు తీసుకోనుంది. ఏపీలో మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి, కావాల్సిన నిధులపై కేంద్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నివేదిక ఇవ్వనున్నారు.

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. సోమవారం కేంద్ర మంత్రి అమిత్ షా అధ్యక్షతన మావోయిస్ట్ ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో జరిగే సమావేశంలో చంద్రబాబు పాల్గొననున్నారు. చత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగిన నేపథ్యంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల సీఎంల సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. 2026 నాటికి వామపక్ష తీవ్రవాదం ఆనవాళ్లు ఉంకూడదనే టార్గెట్‌గా కేంద్రం పని చేస్తోంది.


మావోయిస్టుల ఏరివేత, మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై కేంద్రం చర్చించనుంది. రోడ్ కనెక్టివిటీ, ఫోన్ కనెక్టివిటీ పెంచేలా కేంద్రం చర్యలు తీసుకోనుంది. ఏపీలో మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి, కావాల్సిన నిధులపై కేంద్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నివేదిక ఇవ్వనున్నారు. కేంద్ర మంత్రితో సమావేశం అనంతరం అందుబాటులో ఉన్న ఢిల్లీ పెద్దలను సీఎం కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం.


ఈ వార్తలు కూడా చదవండి..

బరితెగించిన స్మగ్లర్స్.. పోలీసులపై హత్యాయత్నం

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్..

అడ్డంగా బుక్కయిన కల్తీ కేటుగాళ్లు..

కృష్ణా జిల్లా: ప్రేమికులకు అర్ధరాత్రి పెళ్లి ..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Oct 06 , 2024 | 10:33 AM