అడ్డంగా బుక్కయిన కల్తీ కేటుగాళ్లు..

ABN, Publish Date - Oct 06 , 2024 | 08:57 AM

తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్లీ నెయ్యి ఉపయోగించారని వచ్చిన నివేదికలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల్లో ఆందోళనలు రేకెత్తించాయి. శ్రీవారి భక్తులతోపాటు పీఠాధిపతులు, మఠాధిపతులు వివిధ హిందూ దార్మిక సంస్థలు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి.

అమరావతి: తిరుమల లడ్డూ వివాదంపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే ఈ వివాదంపై విచారణ కోసం సుప్రీం కోర్టు స్వతంత్ర కమిటీని నియమించిన విషయం తెలిసిందే. మరోవైపు కల్తీ నెయ్యి వ్యవహారంలో అడ్డగోలుగా వాదిస్తున్న దొంగలు కాస్త అడ్డంగా దొరికిపోయారు. జీఎస్టీ, రవాణాశాఖ అధికారుల నివేదికతో ఏఆర్ డెయిరీ అడ్డంగా బుక్కయింది.


తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్లీ నెయ్యి ఉపయోగించారని వచ్చిన నివేదికలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల్లో ఆందోళనలు రేకెత్తించాయి. శ్రీవారి భక్తులతోపాటు పీఠాధిపతులు, మఠాధిపతులు వివిధ హిందూ దార్మిక సంస్థలు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. అలాగే నెయ్యి కాల్తీకి కారణమైన వైసీపీపై విరుచుకుపడ్డారు. ఆ పార్టీ అధినేత జగన్‌ తిరుమలకు వస్తే అడ్డుకుంటామని కూడా హెచ్చరించారు. దీంతో ఆయన తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే లడ్డూ వివాదంపై సిట్‌ను నియమించడాన్ని సవాల్ చేస్తూ పలువురు సుప్రీం కోర్టులో పిటిషన్లు వేశారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం స్వతంత్ర కమిటీని నియమించింది. ఈ కమిటీ విచారణ జరిపి నివేదికను టీటీడీకి అందించనుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

కృష్ణా జిల్లా: ప్రేమికులకు అర్ధరాత్రి పెళ్లి ..

శ్రీ లలితా త్రిపుసుందరి దేవి అవతారంలో కనకదుర్గ

మాట తూలితే... మంటలే!

జానీ మాస్టర్‌కు మరో షాక్..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Oct 06 , 2024 | 08:57 AM