రైతు భరోసా అమలుకు శ్రీకారం..

ABN, Publish Date - Jul 10 , 2024 | 08:47 AM

హైదరాబాద్: తెలంగాణలో రైతు భరోసా అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఇందు కోసం బుధవారం ఖమ్మంలో రైతులు, రైతు సంఘాలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు సమావేశం కానున్నారు.

హైదరాబాద్: తెలంగాణలో రైతు భరోసా అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఇందు కోసం బుధవారం ఖమ్మంలో రైతులు, రైతు సంఘాలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు సమావేశం కానున్నారు. రైతు భరోసా పథకానికి సంబంధించి విధి, విధానాలపై మంత్రులు ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితులు, సాగు విస్తీర్ణం, రైతాంగ స్థితిగతులపై అధ్యయనం చేయనుంది.

Updated at - Jul 10 , 2024 | 08:47 AM