Petrol పెట్రోల్ బంకు తనిఖీ
ABN , Publish Date - Mar 27 , 2025 | 12:28 AM
స్థానిక దుర్గమ్మగుడి సమీపంలోని భారత పెట్రోల్ బంక్ను ఆర్డీఓ మహేశ, డీఎస్ఓ వంశీక్రిష్ణారెడ్డి బుధవారం తనిఖీచేశారు. పలు రికార్డులను పరిశీలించారు.

ధర్మవరం, మార్చి 26(ఆంధ్రజ్యోతి): స్థానిక దుర్గమ్మగుడి సమీపంలోని భారత పెట్రోల్ బంక్ను ఆర్డీఓ మహేశ, డీఎస్ఓ వంశీక్రిష్ణారెడ్డి బుధవారం తనిఖీచేశారు. పలు రికార్డులను పరిశీలించారు. రోజు వారి వివరాలను రిజిస్ట్రర్లో నమోదు చేయకపోవడం, అదేవిధంగా తాగునీరు, వాహనదారుల వాహనాలకు ఉచితంగా అందించే గాలిపంపు సౌకర్యాలు లేకపోవడం, మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉండటం చూసి మండిపడ్డారు. మరోసారి తనిఖీలకు వచ్చినప్పుడు రికార్డులు, సౌకర్యాలు స్పష్టంగా ఉండాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వారి వెంట సీఎ్సడీటీ సురేంద్రనాథ్, డిప్యూటి తహసీల్దార్ సురేశబాబు ఉన్నారు.