cemetery problem శ్మశానవాటిక సమస్యను పరిష్కారించండి
ABN , Publish Date - Mar 29 , 2025 | 12:33 AM
మండలంలోని ఏలుకుంట్ల గ్రామంలో శ్మశానవాటిక సమస్యను పరిష్కారించాలని మాలమహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు జూటూరు మహేంద్ర, ఆ గ్రామస్థులు కోరారు.

ధర్మవరంరూరల్, మార్చి 28(ఆంధ్రజ్యోతి): మండలంలోని ఏలుకుంట్ల గ్రామంలో శ్మశానవాటిక సమస్యను పరిష్కారించాలని మాలమహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు జూటూరు మహేంద్ర, ఆ గ్రామస్థులు కోరారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ నటరాజను వినతి పత్రం అందజేసిన వారు మాట్లాడారు. సర్వేనెంబర్94లో వంకపోరంబోకు భూమిలో 86సెంట్లులో 60 సంవత్సరాలుగా శ్మశాన ఉందని, అదేగ్రామానికి చెందిన అమరనారాయణ, రామానాయుడులు ఆ స్థలాన్ని కబ్జా చేశారని ఆరోపించారు. ఈ సమస్యను కలెక్టర్, ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదన్నారు. రెండురోజుల క్రితం మాలకులస్థుడు చనిపోతే అక్కడ ఖననం చేయడానికి వెళ్లితే అడ్డుకునే యత్నం చేశారన్నారు. ఇందులో ఏలుకుంట్ల గ్రామస్థులు బిర్రు ప్రకాష్, పుష్పరాజ్, కుళ్లాయప్ప, బాబు పాల్గొన్నారు.