పౌష్టికాహారం అందించడంలో జాగ్రత్తలు తీసుకోవాలి
ABN , Publish Date - Mar 22 , 2025 | 01:10 AM
చిన్న పిల్లలు, తల్లులకు సక్రమంగా పౌష్టికాహారం అందించడంలో అంగన్వాడీ కార్యకర్తలు జాగ్రత్తలు తీసుకోవాలని ఐసీడీఎస్ పీడీ డి.శాంతకుమారి సూచించారు.

ముమ్మిడివరం, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): చిన్న పిల్లలు, తల్లులకు సక్రమంగా పౌష్టికాహారం అందించడంలో అంగన్వాడీ కార్యకర్తలు జాగ్రత్తలు తీసుకోవాలని ఐసీడీఎస్ పీడీ డి.శాంతకుమారి సూచించారు. పోషణ బి పడాయీ బి కార్యక్రమంలో భాగంగా ముమ్మిడివరం ఎంపీడీవో కార్యాలయంలోని సమావేశ మందిరంలో సీడీపీవో ఐ.విమల అధ్యక్షతన నిర్వహించిన శిక్షణ శిబిరంలో పీడీ శాంతకుమారి పాల్గొని మాట్లాడారు. ఐదేళ్లలోపు పిల్లలకు విధిగా తల్లిపాలు అందించాలని, తల్లి పాల ప్రాముఖ్యతను తల్లులకు వివరించాలని సూచించారు. తల్లులు, పిల్లలకు పౌష్టికాహారం సక్రమంగా అందిస్తూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి కృషి చేయాలన్నారు. ఈసందర్భంగా పీడీ సత్యకుమారి, సీడీపీవో విమలలు తల్లిపాల ప్రాముఖ్యత, ఐదేళ్లలోపు పిల్లల పెరుగుదల ప్రాముఖ్యతపై అంగన్వాడీలకు సలహాలు, సూచలనలిచ్చారు. ఈవోఎస్లు జీవీఎస్ఎన్ దేవి, సీహెచ్ పల్లవి, సూపర్వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.