అమ్మవారి ఉత్సవాలకు సేవల కమిటీ ఏర్పాటు
ABN , Publish Date - Mar 27 , 2025 | 01:39 AM
చింతలూరు నూకాంబిక అమ్మవారి ఉత్సవా లకు 19 మంది సభ్యులతో సేవా కమిటీని నియమిస్తూ దేవదాయశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఆలమూరు, మార్చి 26(ఆంధ్రజ్యోతి): చింతలూరు నూకాంబిక అమ్మవారి ఉత్సవా లకు 19 మంది సభ్యులతో సేవా కమిటీని నియమిస్తూ దేవదాయశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. పాలకవర్గం లేకపోవడంతో ఉత్సవాల కోసం ఈనెల 28 నుంచి ఏప్రిల్ 27 వరకు సేవా కమిటీ అమలులో ఉండేలా కమిటీని నియమించారు. సేవా కమిటీలో గన్ని వెంకట్రావు, వీరి శ్రీను, పెద్దింటి సూర్యప్రభ, పసలపూడి నాగేశ్వరరావు, అప్పాడి శివనారాయణ, వంగివరపు నారాయణమ్మ, అత్తిలి వీరబాబు, సోమిరెడ్డి చిలకమ్మ, వాసా వేణుగోపాలకృష్ణ, పుదిరి వాసు, పలివెల శ్రీను, లేగా శ్రీనివాస్, నిడదవోలు సురేష్, మట్టా కాశీ, బొక్కా రామకృష్ణ, అడ్డాల ఆదిత్య ప్రసన్నకుమార్, నూకపెయ్యి చిననాగరాజు, సంగాడి శ్రీను, పావులూరి అర్జునరావులను నియమిస్తూ కమిషనర్ కె. రామచంద్రమోహన్ ఉత్తర్వులు జారీ చేశా రు. ఉత్సవాలను సక్రమంగా నిర్వహించేందుకు సేవా కమిటీ ఏర్పాటు చేయడంపై కొత్తపేట ఎమ్మెల్యే బండారు కృషిని గ్రామస్తులు తదితరులు అభినందించారు.