వాడపల్లి వెంకన్న ఆదాయం రూ.2.73 లక్షలు
ABN , Publish Date - Mar 27 , 2025 | 01:32 AM
వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి బుధవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల తో కిటకిటలాడింది.

ఆత్రేయపురం, మార్చి26(ఆంధ్రజ్యోతి): వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి బుధవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల తో కిటకిటలాడింది. నోము ఆచరించిన భక్తు లు అష్టోత్తర పూజలు, నిత్య కల్యాణాలు జరిపారు. స్వామివారిని దర్శించుకున్న అనంత రం భక్తులు అన్నప్రసాదంలో పాల్గొన్నారు. వివిధ సేవల ద్వారా ఒకరోజు ఆదాయం రూ.2,73,831 వచ్చినట్టు ఉపకమిషనరు, ఈవో నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు.