పాఠశాలకు కంప్యూటర్ సామగ్రి వితరణ
ABN , Publish Date - Mar 22 , 2025 | 12:00 AM
మండలంలోని వి.పి.ఆర్.కండ్రిక జిల్లా పరిషత ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్ధులు కంప్యూటర్, ప్రింటర్, స్కానర్, జిరాక్స్ సెట్ను ప్రధానోపాధ్యాయు డికి అందజేశారు.

రైల్వేకోడూరు రూరల్, మార్చి 21(ఆంధ్రజ్యోతి): మండలంలోని వి.పి.ఆర్.కండ్రిక జిల్లా పరిషత ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్ధులు కంప్యూటర్, ప్రింటర్, స్కానర్, జిరాక్స్ సెట్ను ప్రధానోపాధ్యాయు డికి అందజేశారు. శుక్రవారం విద్యార్థులు డి.శ్రీకాంత, సి.నవీన కు మార్, సి.మోహన కిషోర్, సి.శ్రీనివాసులు, సి.వెంకటరామరాజు, కె. చరణ్ రాజు, కె.జగపతిరాజు, ఆర్. జయప్రకాష్ రాజు పాఠశాల విద్యాభివృద్ధికి తమవంతు సహకారంతో రూ.55 వేలు వెచ్చించి పాఠశాలకు కంప్యూటర్ సామగ్రి అందజేసినట్లు తెలిపారు.