రోడ్డు భద్రత నియమాలను ఉల్లంఘిస్తే కేసులు: ఎస్ఐ
ABN , Publish Date - Mar 22 , 2025 | 11:18 PM
రోడ్డు భద్రత నియమాలను ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని ఎస్ ఐ రామక్రిష్ణ హెచ్చరించారు.

గాలివీడు, మార్చి22(ఆంధ్రజ్యోతి): రోడ్డు భద్రత నియమాలను ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని ఎస్ ఐ రామక్రిష్ణ హెచ్చరించారు. శనివారం మండల కేం ద్రంలోని పశువుల సంత మైదానంలో ట్రాక్టర్ డ్రైవర్లు, యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనం నడిపేటప్పుడు సెల్ఫోన వాడడంతో పాటు పెద్ద శబ్దంతో పాటలు ప్లే చేసే ట్రాక్టర్ డ్రైవర్లకు ఉపేక్షించేది లేదన్నారు.