Share News

ప్రజాపత్రిక ఆంధ్రజ్యోతి

ABN , Publish Date - Mar 23 , 2025 | 12:20 AM

అనునిత్యం ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంటున్న ఆంధ్రజ్యోతి ప్రజాపత్రికగా ఖ్యాతిగడించిందని కలెక్టర్‌ పి.రంజిత్‌ బాషా పేర్కొన్నారు. ఆంధ్రజ్యోతి దినపత్రిక నాలుగు నెలలుగా నిర్వహించిన ‘కార్‌ అండ్‌ బైక్‌ రేస్‌’ విజేతలను కలెక్టర్‌ పి.రంజిత్‌కుమార్‌, ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ లక్కీ డిప్‌ ద్వారా ఎంపిక చేశారు.

ప్రజాపత్రిక ఆంధ్రజ్యోతి
విజేతకు ఫోన్‌ చేస్తున్న కలెక్టర్‌ రంజిత్‌ బాషా

కలెక్టర్‌ పి. రంజిత్‌ బాషా

‘ఆంధ్రజ్యోతి కార్‌ అండ్‌ బైక్‌ రేస్‌’

విజేతలను ఎంపిక చేసిన కలెక్టర్‌, ఎస్పీ

గూడురు పాఠకుడిని వరించిన అదృష్టం

నంద్యాల జిల్లాకు ద్వితీయ బహుమతి

తృతీయ విజేత కోడుమూరు వాసి

కర్నూలు కల్చరల్‌, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): అనునిత్యం ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంటున్న ఆంధ్రజ్యోతి ప్రజాపత్రికగా ఖ్యాతిగడించిందని కలెక్టర్‌ పి.రంజిత్‌ బాషా పేర్కొన్నారు. ఆంధ్రజ్యోతి దినపత్రిక నాలుగు నెలలుగా నిర్వహించిన ‘కార్‌ అండ్‌ బైక్‌ రేస్‌’ విజేతలను కలెక్టర్‌ పి.రంజిత్‌కుమార్‌, ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ లక్కీ డిప్‌ ద్వారా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఆంధ్రజ్యోతి దినపత్రిక పాఠకులకు మరింత చేరువయ్యేలా కార్‌ అండ్‌ బైక్‌ రేస్‌ కూపన్లు ఏర్పాటు చేసి, వారికి మంచి బహుమతులు అందజేయడం ప్రశంసనీయమని అన్నారు. కలెక్టర్‌ రంజిత్‌ బాషా పదివేలకు పైగా ఉన్న కూపన్ల నుంచి ఒక కూపన్‌ తీసి మొదటి బహుమతి ‘బైక్‌’ గెలుపొందిన విజేత డి.వీరేష్‌ కుమార్‌ (గూడూరు)ను ప్రకటించారు. అనంతరం కూపన్‌లోని సెల్‌ నెంబరు ద్వారా విజేతతో కలెక్టర్‌ మాట్లాడి అభినందించారు. ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ మరో కూపన్‌ను తీసి ద్వితీయ బహుమతి ‘రిఫ్రిజ్‌రేటర్‌’ గెలుపొందిన విజేత నంద్యాలకు చెందిన పి.శంకర నారాయణను ప్రకటించారు. విజేతతో ఎస్పీ ఫోన్‌ చేసి అభినందించారు. ఆంధ్రజ్యోతి ఉమ్మడి కర్నూలు జిల్లా బ్రాంచ్‌ మేనేజర్‌ ఎ.లక్ష్మన్‌ ఒక కూపన్‌ తీసి తృతీయ బహుమతి ‘ఎల్‌ఈడీ టీవీ’ గెలుపొందిన చాకలి వెంకటేశ్వర్లు (కోడుమూరు)ను ప్రకటించారు. జిల్లా బ్రాంచ్‌ మేనేజర్‌ ఎ.లక్ష్మన్‌ మాట్లాడుతూ జిల్లాలో పోటీకి వచ్చిన కూపన్లను విజయవాడలో జరిగే రాష్ట్ర పోటీలకు పంపిస్తామని, అక్కడ తీసిన లక్కీ డ్రాలో కారును గెలుచుకున్న విజేతను ప్రకటిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి డిప్యూటి సర్కులేషన్‌ మేనేజర్‌ సోమశేఖర్‌ రెడ్డి, ఆంధ్రజ్యోతి ఎడిషన్‌ ఇన్‌చార్జి చల్లా నవీన్‌కుమార్‌ నాయుడు, బ్యూరో ఇన్‌ఛార్జి గోరంట్ల కొండప్ప, నంద్యాల స్టాఫ్‌ రిపోర్టర్‌ గోపాలకృష్ణ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి స్టాఫ్‌ రిపోర్టర్‌ సుంకన్న, ఆంధ్రజ్యోతి యాడ్స్‌ మేనేజర్‌ గోపాల్‌, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పాఠకులకు ప్రోత్సాహం

ఏ దినదపత్రిక చేయలేని విధంగా పాఠకులను ఆంధ్రజ్యోతి ప్రోత్సహిస్తోందని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ అన్నారు. లక్కీ కూపన్ల ద్వారా పాఠకులను బహుమతుల ద్వారా ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. వార్తలు నిక్కచ్చిగా, నిర్భయంగా రాస్తూ దమ్మున పత్రికగా ఆంధ్రజ్యోతి, దమ్మున్న చానెల్‌గా ఏబీఎన్‌ నిలుస్తోందని కొనియాడారు.

కలెక్టర్‌ ఫోన్‌ చేశారు..

కార్‌ అండ్‌ బైక్‌ రేస్‌ లక్కీ డ్రాలో ప్రఽథమ బహుమతిగా బైక్‌ గెలుచుకున్నట్లు కలెక్టర్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. ఒక్కసారిగా షాక్‌కు గురయ్యా. నా ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఆంధ్రజ్యోతి దిన పత్రికను సంవత్సరం చందా ద్వారా తీసుకున్నా. ఆంధ్రజ్యోతి పత్రిక అంటేనే గుర్తుకొచ్చేది నిఖార్సయిన జర్నలిజం. అనునిత్యం ప్రజల సమస్యలను ప్రచురించి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. బైక్‌ గెలుచుకున్నట్లు నాకు ఫోన్‌ ద్వారా విషయం తెలియగానే బంధువులకు, స్నేహితులకు చెప్పి ఆనందాన్ని పంచుకున్నా. - డమాం వీరేష్‌, గూడూరు, ప్రథమ(బైక్‌) విజేత

Updated Date - Mar 23 , 2025 | 12:20 AM