Share News

Mirch Board: మిర్చి బోర్డు ఏర్పాటు చేయండి: ప్రత్తిపాటి డిమాండ్

ABN , Publish Date - Feb 05 , 2025 | 03:52 PM

Mirch Board: ధరల హెచ్చు తగ్గులతో మిర్చి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఆవేదన వ్యక్తం చేశారు. పొగాకు బోర్డు ఏర్పాటు చేసినట్లు .. మిర్చి బోర్డు సైతం ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆయన డిమాండ్ చేశారు.

Mirch Board: మిర్చి బోర్డు ఏర్పాటు చేయండి: ప్రత్తిపాటి డిమాండ్

చిలకలూరిపేట, ఫిబ్రవరి 05: మిర్చి రైతుల పరిస్థితి దిక్కుతోచని స్థితిలో ఉందని చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఆవేదన వ్యక్తం చేశారు. పతనమవుతోన్న ధరలతో వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రధాన వాణిజ్య పంట సాగుదారులను రక్షించాల్సిన బాధ్యత కేంద్రానిదేనని ఆయన స్పష్టం చేశారు. బుధవారం చిలకలూరిపేటలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. పొగాకు బోర్డు మాదిరిగా.. మిర్చి బోర్డును ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.

తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించేలా మిర్చి రైతుల దశ మారేలా కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని ఆయన పేర్కొన్నారు. వ్యాపారుల మాయాజాలం.. మార్కెట్ హెచ్చుతగ్గుల నియంత్రణఖు ప్రత్యేక చట్టాల ద్వారా చెక్ పెట్టాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో మిర్చి ధరల పతనంపై కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. మిర్చి రైతుల్ని వెంటనే ఆదుకోవాలంటూ ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారని వివరించారు.


ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని జిల్లాల్లో మాత్రమే మిర్చి పంటను రైతులు పండిస్తున్నారు. అయితే మిర్చి పంటను విక్రయించే క్రమంలో రైతులు దళారుల చేతిలో మోసపోతున్నారు. ఒక్కొక్కసారి మార్కెట్‌లో ధరల హెచ్చ తగ్గుల కారణంగా.. పండించిన పంటకు అయిన ఖర్చుకు తగినట్లుగా నగదు చేతికందడం లేదు. దీంతో మిరప వాణిజ్య పంటే అయినా.. దానికి తగినట్లుగా నగదు చేతికందడం లేదు. దాంతో మిర్చి రైతులు ఢీలా పడిపోతున్నారు. అలాంటి వేళ.. మాజీ వ్యవసాయ శాఖ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుపై విధంగా స్పందించారు.

Also Read : కడప జిల్లాలో క్లబ్ మూసివేసిన పోలీసులు


మరోవైపు.. గుంటూరులో పొగాకు బోర్డును గతంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం విధితమే. అలాగా ఆంధ్రప్రదేశ్‌లో మిర్చి బోర్డును సైతం ఏర్పాటు చేయాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. అదీకాక.. ఇటీవల తెలంగాణలో పసుపు బోర్డును ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయడమే కాదు.. ఈ బోర్డుకు చైర్మన్‌గా గంగిరెడ్డిని నియమిస్తున్నట్లు ప్రకటించింది.


నిజామాబాద్ వేదికగా పసుపు బోర్డు ఏర్పాటు చేయాలంటూ గత కొన్ని దశాబ్దాలుగా డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. అందులోభాగంగా ఇటీవల కేంద్రం ఈ బోర్డునే ఏర్పాటు చేసింది. ఇదే తరహాలో గుంటూరు లేదా మిర్చి అధికంగా పండే జిల్లాలో మిర్చి బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ గత కొంత కాలంగా ప్రధానంగా వినపడుతోన్న సంగతి తెలిసిందే.

For AndhraPradesh News And Telugu News

Updated Date - Feb 05 , 2025 | 03:52 PM