కురిచేడు పోలీస్ స్టేషన్కు డ్రోన్ కెమెరా బహూకరణ
ABN , Publish Date - Mar 18 , 2025 | 11:58 PM
కురిచేడు పోలీస్ స్టేషన్కు డ్రోన్ కెమె రాను మండలంలోని ఆవులమంద గ్రామానికి చెందిన మాజీ నీటి సంఘం అధ్యక్షుడు గొట్టిపాటి వెంకటేశ్వర్లు మంగళవారం అందజేశారు. ప్రస్తుత త రుణంలో చోరీలు పెచ్చుమీరడంతోపాటు టెక్నాలజీని వాడుతూ దొంగలు చి క్కకుండా తప్పించుకుతిరుగుతున్నారు. ఈక్రమంలో పోలీసులు సైతం అ త్యాధునిక టెక్నాలజీని సొంతం చేసుకుంటున్నారు.

కురిచేడు, మార్చి 18(ఆంధ్రజ్యోతి): కురిచేడు పోలీస్ స్టేషన్కు డ్రోన్ కెమె రాను మండలంలోని ఆవులమంద గ్రామానికి చెందిన మాజీ నీటి సంఘం అధ్యక్షుడు గొట్టిపాటి వెంకటేశ్వర్లు మంగళవారం అందజేశారు. ప్రస్తుత త రుణంలో చోరీలు పెచ్చుమీరడంతోపాటు టెక్నాలజీని వాడుతూ దొంగలు చి క్కకుండా తప్పించుకుతిరుగుతున్నారు. ఈక్రమంలో పోలీసులు సైతం అ త్యాధునిక టెక్నాలజీని సొంతం చేసుకుంటున్నారు. ఎస్పీ దామోదర్ పిలుపు తో గొట్టిపాటి వెంకటేశ్వర్లు పోలీస్స్టేషన్కు డ్రోన్ కెమెరాను అందజేయడా నికి నిర్ణయించుకున్నారు. డీజేఐ ఎయిర్3ఎస్ సాంకేతిక డ్రోన్ను ఎస్పీ దా మోదర్కు అందజేశారు. ప్రజలు సామాజిక బాధ్యతో మెలిగి పోలీసులకు స హకరిస్తే నేరాల కట్టడి సులభమవుతుందని ఎస్పీ పేర్కొన్నారు. ఈడ్రోన్ను త్రిపురాంతకం సర్కిల్ ఇన్స్పెక్టర్ అసన్కు ఎస్పీ అందజేశారు. కార్యక్రమం లో టీడీపీ నాయకులు ఏడుకొండలు, వి.వెంకటేశ్వర్లు, బస్సు రామయ్య, కొలిసెట్టి కాశీవిశ్వనాథరావు పాల్గొన్నారు.