ఆర్థిక అసమానతలు తొలగించాలి
ABN , Publish Date - Mar 21 , 2025 | 12:09 AM
సమాజంలో ఆర్థిక అస మానతలు తొలగించడ మే లక్ష్యంగా ప్రతీ జన సేన కార్యకర్త కలిసి కట్టుగా పని చేయాలని ఆ పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పిసిని చంద్రమోహన్ పిలుపునిచ్చారు.

శ్రీకాకుళం రూరల్, మార్చి 20(ఆంధ్రజ్యోతి): సమాజంలో ఆర్థిక అస మానతలు తొలగించడ మే లక్ష్యంగా ప్రతీ జన సేన కార్యకర్త కలిసి కట్టుగా పని చేయాలని ఆ పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పిసిని చంద్రమోహన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు రూరల్ మం డల పరిధిలో ఉన్న పార్టీ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా కమిటీ కార్యవర్గ సమావేశం నిర్వమించారు. ఈ సందర్భంగా చంద్రమోహన్ మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి ప్రతీ ఒక్కరూ చిత్తశుద్ధితో పని చేయాలన్నారు. ప్రతీ గ్రామంలో పార్టీ జెండాలు ఆవిష్కరించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పి.పాపారావు, నాయకులు సత్తిబాబు, కూరాకుల యాదవ్, సంతోష్ పండా, రాజు తదితరులు పాల్గొన్నారు.