జాడిపూడి ఆర్ఎస్ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదన
ABN , Publish Date - Mar 18 , 2025 | 11:50 PM
జాడుపూడి ఆర్ఎస్ నుంచి రైల్వేస్టేషన్ వరకు రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు తయారుచేసి మంత్రికి అందజేశామని, నిధులు విడుదలైన వెంటనే పనులు జరిగేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ విప్ అశోక్ తెలిపారు.

కవిటి, మార్చి18(ఆంధ్రజ్యోతి): జాడుపూడి ఆర్ఎస్ నుంచి రైల్వేస్టేషన్ వరకు రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు తయారుచేసి మంత్రికి అందజేశామని, నిధులు విడుదలైన వెంటనే పనులు జరిగేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ విప్ అశోక్ తెలిపారు. మంగళవారం ఆర్ఎస్ నుంచి రైల్వేస్టేషన్ వరకు రోడ్డుకు నిధులు మంజూరు చేయించాలని జాడుపూడి ఆర్ఎస్ గ్రామస్థులు, టీడీపీ మండలాధ్యక్షుడు మణిచంద్రప్రకాష్, నేతలు సంతోష్పట్నాయక్, భీమారావురౌళో, బాసుదేవ్రౌళో విజయవాడలో విప్ బి.అశోక్కు వినతిపత్రం అందజేశారు.