TDP anniversary: తెలుగుదేశం పార్టీకి శుభాకాంక్షలు
ABN , Publish Date - Mar 30 , 2025 | 04:54 AM
టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ ప్రజల గొంతుకగా, జాతీయ రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదిగిందని కొనియాడారు.

టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. శనివారం ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. ‘1982లో ఉమ్మడి రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదికగా, ప్రజల గొంతుకగా ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ 42 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకుని 43వ సంవత్సరంలోకి అడుగుపెట్టడం ఆనందంగా ఉంది. విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ, జాతీయ రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదిగి, ప్రజల పక్షాన నిలిచింది. 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు, శుభాకాంక్షలు.’ అని పేర్కొన్నారు.
- డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ఈ వార్తలు కూడా చదవండి
CM Chandrababu: ఆ అమరజీవి త్యాగాన్ని స్మరించుకుందాం..
Minister Ramanaidu: ఏపీని ధ్వంసం చేశారు.. జగన్పై మంత్రి రామానాయుడు ఫైర్
Srisailam: శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. కొత్త తరహా మోసం
For More AP News and Telugu News