Share News

TDP nominated posts: 38 ఏఎంసీలకు చైర్మన్లు

ABN , Publish Date - Apr 05 , 2025 | 02:45 AM

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నామినేటెడ్‌ పదవుల భర్తీకి వేగం పెంచింది. ఇప్పటివరకు 85 వ్యవసాయ మార్కెట్‌ కమిటీలకు చైర్మన్లు నియమించగా, మిగిలినవి త్వరలో ప్రకటించనున్నారు.

TDP nominated posts: 38 ఏఎంసీలకు చైర్మన్లు

టీడీపీకి 31, జనసేనకు 6, బీజేపీకి 1

అమరావతి, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నామినేటెడ్‌ పదవుల భర్తీ ప్రక్రియ ఊపందుకుంది. వారం క్రితం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ(ఏఎంసీ)ల భర్తీకి శ్రీకారం చుట్టిన టీడీపీ అధిష్ఠానం.. తొలి విడతలో 47 ఏఎంసీలకు చైర్మన్లను నియమించింది. తాజాగా శుక్రవారం మరో 38 మార్కెట్‌ కమిటీలకు చైర్‌పర్సన్లను ప్రకటించారు. వీటిలో 31 టీడీపీకి, 6 జనసేనకు, ఒకటి బీజేపీకి కేటాయించారు. పదవుల భర్తీలో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ప్రజాభిప్రాయానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకుల అభిప్రాయాలను తీసుకుంటూనే.. వారు సూచించిన అభ్యర్థులపై ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉందో వివిధ సర్వేల ద్వారా తెలుసుకుంటున్నారు. చివరిగా అధికశాతం ప్రజల మద్దతున్న వారిని ఎంపిక చేస్తున్నారు. మొత్తం 218 ఏంఎసీల్లో తాజా జాబితాతో కలిపి ఇప్పటికి85 కమిటీలకు చైర్మన్లను నియమించారు. మిగిలిన 133 ఏఎంసీలకు కూడా 15 రోజుల్లోనే నియామకాలు జరుపనున్నారు. వారంరోజుల్లో ఇంకో జాబితా విడుదల చేస్తారని భావిస్తున్నారు. ఆ తర్వాత 21 ప్రధాన దేవాలయాలకు కమిటీలను ప్రకటించనున్నారు. ఈ నెలఖరులోగా కీలకమైన మరో 60 కార్పొరేషన్లకు కూడా చైర్మన్లను నియమించాలని చంద్రబాబు భావిస్తున్నారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలన్న ఆలోచనతో కసరత్తు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

Borugadda Anil: రాజమండ్రి నుంచి అనంతపురానికి బోరుగడ్డ.. ఎందుకంటే

Kasireddy shock AP High Court: లిక్కర్ స్కాంలో కసిరెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 05 , 2025 | 02:45 AM