గవర్నర్కు సాదర స్వాగతం
ABN , Publish Date - Mar 24 , 2025 | 01:08 AM
నగర పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్కు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.

గోపాలపట్నం, మార్చి 23 (ఆంధ్రజ్యోతి):
నగర పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్కు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఆదివారం రాత్రి 8.45 గంటలకు విజయవాడ నుంచి విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న గవర్నర్ దంపతులకు కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్, పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చీ, డీపీసీ-2 మేరీ ప్రశాంతి, గోపాలపట్నం, గాజువాక తహసీల్దార్లు, పలువురు అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గంలో నగరానికి బయలుదేరి వెళ్లారు.