Income Tax Changes: ఏప్రిల్ 1 నుంచి వచ్చే కొత్త పన్ను రేట్లు తెలుసుకోండి..మనీ సేవ్ చేసుకోండి..
ABN , Publish Date - Mar 29 , 2025 | 04:51 PM
దేశంలో ఏప్రిల్ 1, 2025 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలు కానుంది. ఈ క్రమంలో ప్రతి వ్యక్తి, ఉద్యోగి, వ్యాపారులు కూడా వచ్చే కొత్త పన్ను రేట్ల మార్పుల గురించి తెలుసుకోవాలి. వీటి గురించి తెలుసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఆర్థిక నిబంధనల విషయంలో ఇబ్బంది లేకుండా ఉంటారు.

ఇండియాలో ఏప్రిల్ 1, 2025 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలు కానుంది. ఇదే సమయంలో పలు ఆర్థిక నియామాల్లో మార్పులు రాబోతున్నాయి. ఈ మార్పులు భారతదేశంలోని ఉద్యోగులు, వ్యాపారులు సహా అనేక మందిపై ప్రభావం చూపించనున్నాయి. అయితే ఈసారి ఎలాంటి మార్పులు రానున్నాయి. జీఎస్టీ రేట్లలో మార్పులు ఎలా ఉన్నాయనే ఇతర విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. కొత్త ఆదాయపు పన్ను స్లాబ్స్ అమలు
2025 ఏప్రిల్ 1 నుంచి దేశంలో కొత్త ఆదాయపు పన్ను స్లాబ్స్ అమల్లోకి రాబోతున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025 సంవత్సరానికి బడ్జెట్ ప్రసంగంలో ఈ మార్పులను ప్రకటించారు. ఈ కొత్త పన్ను విధానం ప్రకారం, ఏడాదికి 12 లక్షల రూపాయల వరకు ఆదాయం ఉన్నవారు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అలాగే, జీతం పొందే వ్యక్తులకు రూ. 75,000 స్టాండర్డ్ డిడక్షన్ ఇవ్వబడుతుంది. దీని ద్వారా, 12,75,000 రూపాయల వరకు జీతం పొందే వ్యక్తులు కూడా పన్ను చెల్లించకుండా ఉంటారు.
కొత్త ఆదాయపు పన్ను స్లాబ్స్:
ఆదాయం స్లాబ్ - పన్ను రేటు
0 - రూ. 4 లక్షలు - పన్ను లేదు
రూ. 4 లక్షలు - రూ. 8 లక్షలు 5%
రూ. 8 లక్షలు - రూ. 12 లక్షలు 10%
రూ. 12 లక్షలు - రూ. 16 లక్షలు 15%
రూ. 16 లక్షలు - రూ. 20 లక్షలు 20%
రూ. 20 లక్షలు - రూ. 24 లక్షలు 25%
రూ. 24 లక్షలు పైగా - 30%
యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (UPS)
భారత ప్రభుత్వ విభాగం 2024 ఆగస్టులో యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ను ప్రారంభించింది. ఈ స్కీమ్ను 2025 ఏప్రిల్ 1 నుంచి అమలు కానుంది. ఈ కొత్త పెన్షన్ స్కీమ్ ద్వారా 23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం లభిస్తుంది. ఈ క్రమంలో కనీసం 25 సంవత్సరాలు సేవలు అందించిన ఉద్యోగులు తమ చివరి 12 నెలల ప్రాథమిక జీతం ఆధారంగా 50% పెన్షన్ పొందుతారు. ఈ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల రిటైర్మెంట్ తర్వాత వారికి ఆర్థిక భద్రతను అందిస్తుంది.
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) సెక్యూరిటీ మార్పులు
2025 ఏప్రిల్ 1 నుంచి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) మెరుగుపరచడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొన్ని మార్పులను ప్రకటించింది. ఈ మార్పుల ప్రకారం బ్యాంకులు, UPI వినియోగదారుల మొబైల్ నంబర్లు అక్టివేట్ ఉన్నాయా లేదా అనేది నిర్ధారించుకోవాలి. యాక్టివేట్ లేని నంబర్లకు యూపీఐ సేవలు తొలగించబడతాయి.
GST, E-Way బిల్లులు
కొత్త ఆర్థిక సంవత్సరంలో GST విధానంలో కూడా కొన్ని మార్పులు వచ్చాయి. ఈ మార్పుల్లో ప్రధానమైనది మల్టీ-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ (MFA). ఇది GST పోర్టల్లో మరింత భద్రత కోసం పన్నుదారుడి ఖాతాలో లాగిన్ చేయడానికి ప్రవేశపెట్టిన విధానం. అలాగే, E-Way బిల్లులు (EWBs) తయారు చేయడానికి ఆధారపు డాక్యుమెంట్లు 180 రోజుల నాటికి తీసుకోవడం తప్పనిసరి.
TDS ఫైల్ మార్పులు
GST-7లో TDS ఫైల్ చేస్తున్న వ్యక్తులకు కొత్త మార్పులు వర్తిస్తాయి. ఇకపై మీరు ఏదైనా నెలల్లో మిస్సయితే లేదా అనుచితంగా ఫైల్ చేస్తే, అది సాధ్యం కాదు. ప్రతి నెలలో పన్ను ఫైల్ చేయాల్సి ఉంటుంది.
బయోమెట్రిక్ ధృవీకరణ
ప్రొమోటర్లు, డైరెక్టర్లు ఇకపై GST సువిధా కేంద్రంలో బయోమెట్రిక్ ధృవీకరణకు తప్పనిసరిగా హాజరుకావాల్సి ఉంటుంది. ఇది పన్ను సదుపాయాలు భద్రతతోపాటు ఈజీగా ఉండేందుకు సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
Railway Jobs: రైల్వేలో 9,970 పోస్టులకు నోటిఫికేషన్..అప్లై చేశారా లేదా..
New Tax Rules: ఏప్రిల్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.. తెలుసుకుంటే మీకే లాభం..
Single Recharge: ఒకే రీఛార్జ్తో ముగ్గురికి ఉపయోగం..సరికొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన బీఎస్ఎన్ఎల్
Layoffs: ఎంది సామి..మళ్లీ 9 వేల లే ఆఫ్స్, ఇక మిగిలేది ఎవరు..
NASSCOM: వచ్చే రెండేళ్లలో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ శిక్షణ
Read More Business News and Latest Telugu News