గూగుల్, ఫేస్బుక్లకు ఊరట
ABN , Publish Date - Mar 26 , 2025 | 03:56 AM
వాణిజ్య చర్చల్లో అమెరికాను మెప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో చర్య తీసుకుంది. గూగుల్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి ఆన్లైన్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వచ్చే ప్రకటనలపై ...

డిజిటల్ ప్రకటనలపై పన్ను పోటు రద్దు
న్యూఢిల్లీ: వాణిజ్య చర్చల్లో అమెరికాను మెప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో చర్య తీసుకుంది. గూగుల్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి ఆన్లైన్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వచ్చే ప్రకటనలపై ఈక్వలైజేషన్ లెవీ పేరుతో విధించే 6 శాతం పన్నును ప్రభుత్వం రద్దు చేసింది. గూగుల్ ట్యాక్స్గా పేరొందిన ఈ పన్నును ఏప్రిల్ 1 నుంచి రద్దు చేస్తున్నట్టు తెలిపింది. దీనికి సంబంధించి ఆర్థిక బిల్లు, 2025కు చేసిన సవరణకు పార్లమెంట్ కూడా ఆమోద ముద్ర వేసింది. దీంతో అమెరికా-భారత్ మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చలు సానుకూలంగా ముగిసే అవకాశాలు మరింత మెరుగయ్యాయని భావిస్తున్నారు. ఈ డిజిటల్ మీడియా ప్లాట్ఫారాల్లో దేశీయ కంపెనీలు ఇచ్చే ప్రకటనలపై 2016లో ప్రభుత్వం ఈ పన్ను విధించింది. దీనిపై అమెరికా గతంలోనే ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పన్నును వెనక్కి తీసుకోకపోతే భారత్ నుంచి దిగుమతయ్యే రొయ్యలు, బాస్మతి బియ్యంపై తామూ అదే స్థాయిలో పన్ను విధిస్తామని హెచ్చరించింది. తాజా చర్యతో ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్పై ప్రకటనల ఖర్చు తగ్గడంతో పాటు వాటి లాభాలూ పెరుగుతాయని భావిస్తున్నారు. ప్రముఖ అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ ఈవై సీనియర్ సలహాదారు సుదీర్ కపాడియా ప్రభుత్వ చర్యను తెలివైన చర్యగా అభివర్ణించారు. అమెరికాతో తలెత్తిన వాణిజ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఈ చర్య ఉపకరిస్తుందన్నారు.
ఇవి కూడా చదవండి:
Layoffs: ఎంది సామి..మళ్లీ 9 వేల లే ఆఫ్స్, ఇక మిగిలేది ఎవరు..
Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..
Read More Business News and Latest Telugu News

కొత్త ఏడాది మారనున్న రూల్స్.. తెలుసుకోకుంటే మీకే లాస్

కాలిన నోట్లను బ్యాంకులో ఇచ్చి క్యాష్ తీసుకోవచ్చా..

ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ పెంపు గురించి అధికారిక ప్రకటన

వారాంతాన నష్టాల్లో ముగిసిన మార్కెట్ సూచీలు

ఈరోజున బ్యాంక్ సెలవు రద్దు.. ఆదివారం కూడా ఈ ఆఫీసులు ఓపెన్..
