Stock Market Update: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు
ABN , Publish Date - Mar 27 , 2025 | 03:49 PM
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఒడిదుడుకుల నడుమ చివరికి ఇవాళ లాభాల్లో ముగిశాయి.

Stock Market : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ లాభాల్లో ముగిశాయి. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు వెంటనే కోలుకొని లాభాల దిశగ పరుగులు తీశాయి. అయితే, తర్వాత తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంది. దాదాపు అంతర్జాతీయ మార్కెట్లన్నీ నష్టాలు నమోదు చేయగా మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. అయితే, ప్రధాన షేర్లలో కొనుగోళ్ల మద్దతు లాభాల బాటలో ముందుకు సాగేందుకు దోహదం చేశాయి.
మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ (Sensex) 317.93 పాయింట్లు లాభంతో 77,606.43 వద్ద ముగియగా, నిఫ్టీ (Nifty) 105.10 పాయింట్ల లాభంతో 23,591.95 దగ్గర క్లోజ్ అయింది. అటు ఆసియా మార్కెట్లు కూడా నష్టాల్లో ముగిశాయి. జపాన్ నిక్కీ 0.81 శాతం నష్టంతో ముగియగా, హాంకాంగ్ హాంగె సెంగ్ 0.41 శాతం లాభంతో ముగిసింది.
ఇవి కూడా చదవండి:
కామెడీ చేయటం మానుకోండి.. యోగిపై స్టాలిన్ ఫైర్..
ఓలా, ఉబర్లకు షాక్.. కేంద్రం కొత్త యాప్.. ఇక డ్రైవర్లకు పండగే