Share News

యూసీబీలు పటిష్ఠంగా ఉండాలి: మల్హోత్రా

ABN , Publish Date - Mar 20 , 2025 | 03:43 AM

నానాటికీ పెరుగుతున్న ఐటీ, సైబర్‌ రిస్క్‌ల నేపథ్యంలో దేశంలో పట్టణ సహకార బ్యాంకులు (యూసీబీ) నిర్వహణాపరంగా పటిష్ఠంగా ఉండాలని ఆర్‌బీఐ గవర్నర్‌...

యూసీబీలు పటిష్ఠంగా ఉండాలి: మల్హోత్రా

నానాటికీ పెరుగుతున్న ఐటీ, సైబర్‌ రిస్క్‌ల నేపథ్యంలో దేశంలో పట్టణ సహకార బ్యాంకులు (యూసీబీ) నిర్వహణాపరంగా పటిష్ఠంగా ఉండాలని ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా సూచించారు. ఆయన బుధవారం ఎంపిక చేసిన యూసీబీల చైర్మన్లు, ఎండీలు, సీఈఓలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అట్టడుగు స్థాయిలు ప్రజలకు సేవలందిస్తూ ఫైనాన్షియల్‌ ఇంక్లూజన్‌ను మరింత లోతుగా పాదుకునేలా చేయడంతో యూసీబీల పాత్రను ప్రశంసించారు. డిపాజిటర్లు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు కృషి చేయాలని సూచించారు.

Updated Date - Mar 20 , 2025 | 03:43 AM