Share News

MGNREGA Employment Scheme: ఉపాధి నిధుల విడుదలలో వివక్ష లేదు

ABN , Publish Date - Mar 26 , 2025 | 04:56 AM

కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ నిధుల విడుదలలో ఏ రాష్ట్రానికీ వివక్ష చూపడం లేదని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్‌ కంటే తమిళనాడుకు అధిక నిధులు మంజూరు చేసినట్టు తెలిపారు.

MGNREGA Employment Scheme: ఉపాధి నిధుల విడుదలలో వివక్ష లేదు

బెంగాల్‌లో ఉపాధి నిధుల దుర్వినియోగం: పెమ్మసాని

న్యూఢిల్లీ, మార్చి 25(ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ నిధుల విడుదలలో కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రం పట్ల వివక్ష చూపడం లేదని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్‌ కంటే తమిళనాడుకు అధికంగా నిధులు ఇచ్చామని చెప్పారు. తమిళనాడుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రూ.7,300 కోట్ల వచ్చాయన్నారు. మంగళవారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు ఉపాది హామీ నిధుల విడుదలలో వివక్ష చూపుతున్నారని ప్రశ్నించగా కేంద్ర మంత్రి ఈమేరకు సమాధానం ఇచ్చారు. ‘‘తమిళనాడు జనాభా 7 కోట్లు, ఉత్తరప్రదేశ్‌ జనాభా 20 కోట్లకుపైగానే ఉంది. కానీ, ఉపాధి నిధుల్లో తమిళనాడుకే ఎక్కువగా ఇస్తున్నాం. తమిళనాడుకు రూ.10 వేల కోట్లు ఇస్తుండగా, యూపీకి రూ.10 వేల కోట్ల లోపే ఇస్తున్నాం’’ అని వివరించారు. పశ్చిమబెంగాల్‌కు ఇస్తున్న ఉపాధి నిధులు దుర్వినియోగం అవుతున్నాయని మంత్రి చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి

CM Chandrababu On DSC: మెగా డీఎస్సీపై కీలక అప్డేట్.. వచ్చే నెల మొదటి వారంలోనే

Viveka Case Update: వివేకా హత్య కేసు.. అవినాష్ కుట్రను బయటపెట్టిన ఏపీ సర్కార్

Vallabhaneni Vamsi Remand: మరికొన్ని రోజులు జైల్లోనే వంశీ

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 26 , 2025 | 04:56 AM